మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంపై పోలీసుల సహకారంతో దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ శాసనసభ్యుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రవెల్లికి చేరుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎర్రవెల్లికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ క్రమంలో హైడ్రామా నెలకొంది. ఈ ప్రణాళికలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శాసనసభ్యులు, పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారనే సమాచారంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించాయి. అయితే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని తీవ్రంగా నిలదీసి, అక్కడి నుండి తరిమికొట్టడంతో వాతావరణం కాసేపు రణరంగాన్ని తలపించింది.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎంతమందిని అరెస్టూ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ శ్రేణులు భయపడేది లేదని, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడతాయని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి దళితులపై నిజంగా ప్రేమ ఉంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన దళిత, గిరిజన డిక్లరేషన్ హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్పై కుట్రలు చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయంలో తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
పార్టీ కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోవద్దని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
{{/usCountry}}పార్టీ కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోవద్దని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
{{/usCountry}}మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అంతకుముందు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి కేసీఆర్ నివాసానికి చేరేలా చేసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడికి కుట్ర పన్నుతున్నారని, గూండాలను, రౌడీలను పంపుతున్నారని ఆరోపించారు.
భూ భారతి చట్టం కింద ప్రభుత్వ భూములను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల వంటి సమస్యలను లేవనెత్తకుండా ఆపేందుకు, బీఆర్ఎస్ శాసనసభ్యులను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ను రక్షించడానికి ఎర్రవెల్లికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని కూడా ఆయన ఆరోపించారు.