ప్రయాణికులకు భద్రత కల్పించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ఆర్టీసీ ) తెలంగాణ పోలీసుల భాగస్వామ్యంతో ఆదిలాబాద్ జిల్లాలో 'బస్సులో భరోసా' పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బస్సుల్లో జరిగే కార్యకలాపాలను సరిగ్గా పర్యవేక్షించేందుకు, ప్రయాణికులకు తగిన భద్రత కల్పించేందుకు జిల్లాలో నడుస్తున్న 175 టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా దొంగతనం, వేధింపుల వంటి ఎలాంటి తప్పుడు పనులు చేసినా.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. దీంతో అధికారులు నిందితులను పట్టుకునేందుకు సులువుగా ఉంటుంది.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఆదిలాబాద్లో భద్రతను పెంచేందుకు పోలీసులు అన్ని బహిరంగ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాల ఏర్పాటు ప్రయాణికులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంటున్నారు. ఈ పథకాన్ని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె
మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కొంతకాలంగా వేతనాలు, బెనిఫిట్స్, సర్వీస్ సమస్యల మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. మార్చి 13న ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు సమ్మె చేపట్టనున్నారు. ఏప్రిల్ 22 గడువు సమీపిస్తుండటంతో అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయిలో సేవలు నిలిచిపోతాయని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమ్మె సంస్థకూ, ప్రజలకూ తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంటూ ఆర్టీసీ ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చలు, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేసి, పరిష్కారాలు కోరడానికి ప్రభుత్వ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన విషయాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, విలీనం అంశంపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలు మినహా, ఉద్యోగులు లేవనెత్తిన మిగతా అన్ని ఆందోళనలపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన విషయాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, విలీనం అంశంపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలు మినహా, ఉద్యోగులు లేవనెత్తిన మిగతా అన్ని ఆందోళనలపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}