Adilabad : ఆదిలాబాద్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం.. నీటి కొరత కారణంగా అక్కడ కొత్తగా బోర్లు
Adilabad Municipality : ఆదిలాబాద్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నీటి కొరత కారణంగా కొత్తగా బోర్డు వేసేందుకు సిద్ధమవుతోంది.
ఎండలు ముదరనే లేదు. అప్పుడే తాగునీటి సమస్యలు మెుదలయ్యేలా కనిపిస్తున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక మే నెలలో పరిస్థితుల ఎలా ఉంటాయోనని జనాలు ఇప్పటికే భయపడుతున్నారు.

తాగునీటి వనరులు ఎండిపోతున్న నేపథ్యంలో గృహాలకు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రస్తుత నీటి ట్యాంకుల ప్రదేశాలలో బోర్వెల్స్ తవ్వడానికి ఆదిలాబాద్ మున్సిపాలిటీ సిద్ధమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోవడంతో మున్సిపాలిటీలో నీటి పంపిణీలో ఇబ్బందులు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు.
మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా కోసం నీటిని నిల్వ చేయడానికి, పంప్ హౌస్ సమీపంలోని లాండసాంగ్వి వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న పంప్ హౌస్ వద్ద పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉందని, డిమాండ్ను తీర్చడానికి దానిని పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా గ్రామాల్లో కూడా నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా చనాకా-కొరాటా నుంచి ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా పథకం కోసం రూ. 54 కోట్లు కోరుతూ మున్సిపాలిటీ ఒక ప్రతిపాదనను సమర్పించింది. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది నాటికి పూర్తయి, కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రతిపాదిత ప్రణాళికలో భాగంగా, చనాకా-కొరాటా బ్యారేజీ నుండి పురపాలక సంఘం వరకు 17 కిలోమీటర్ల పైప్లైన్ను వేయనున్నారు. నీటిమట్టాలు పడిపోవడం వల్ల ఎస్ఆర్ఎస్పీ నుండి మిషన్ భగీరథ కింద నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడి, పంపిణీపై మరింత ప్రభావం పడుతోంది.
ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ బండరి అనూష మాట్లాడుతూ.. 49 కాలనీలలోని గృహాలకు నీటిని తోడి సరఫరా చేసేందుకు, కాలనీలలో గుర్తించిన నీటి ట్యాంకుల సమీపంలో ఒక్కొక్కటి చొప్పున సుమారు 30 బోర్వెల్స్ను తవ్వాలని మున్సిపాలిటీ ఆలోచిస్తున్నట్టుగా ప్రకటించారు. తక్షణ కొరతను తీర్చడానికి రెండు రోజుల్లో బోర్వెల్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


