తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ (Census 2027) నేటి నుంచే ప్రారంభమైంది. ఈసారి విశేషం ఏంటంటే.. పెన్ను, పేపర్ అవసరం లేకుండానే, మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ వివరాలను మీరే సులభంగా నమోదు చేసుకోవచ్చు.

మీరు ఎవరి కోసమో వేచి చూడాల్సిన పనిలేదు. ఏప్రిల్ 26 (ఆదివారం) నుండి మే 10 వరకు ఆన్లైన్లో మీ వివరాలను మీరే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం https://se.census.gov.in వెబ్సైట్ వెళ్లండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంటుంది. వివరాలు నింపాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది.
మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే, మీకు ఒక 'సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ' వస్తుంది. ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు
- మొదటి దశ (మే 10 వరకు): ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్.
- ఇంటింటి సేకరణ (మే 11 నుండి జూన్ 9 వరకు): ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు.
- రెండో దశ (ఫిబ్రవరి 9 - 28, 2027): తుది జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతుంది.
వివరాలు నమోదు చేసేటప్పుడు మీరు ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో చేసేవారు 27 ప్రశ్నలకు, నేరుగా ఎన్యూమరేటర్లకు చెప్పేవారు 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. తెలంగాణలో మొదటిసారిగా పెన్ను, పేపర్ వాడకుండా కేవలం మొబైల్ యాప్ ద్వారానే ఈ డేటాను సేకరిస్తున్నారు. ఇది కేవలం జనాభా లెక్కల కోసం మాత్రమే. దీనికి ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. మీరు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే మీ వివరాలు నమోదు చేసుకోవాలి.
మీకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1855 కు ఫోన్ చేయవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణలో తొలిసారి కేంద్రం జనగణనతో పాటు కులగణన ప్రక్రియ చేస్తోంది.
{{/usCountry}}మీకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1855 కు ఫోన్ చేయవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణలో తొలిసారి కేంద్రం జనగణనతో పాటు కులగణన ప్రక్రియ చేస్తోంది.
{{/usCountry}}తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ దశ ఏప్రిల్ 26న ప్రారంభమై మే 10 వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే జనగణన యూనిట్గా పరిగణిస్తారు.
15 రోజుల వ్యవధిలో, నివాసితులు అధికారిక పోర్టల్ అయిన www.se.census.gov.in ద్వారా తమ కుటుంబ వివరాలను స్వచ్ఛందంగా ఆన్లైన్లో సమర్పించవచ్చు. 2027 జనాభా లెక్కలు భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయని, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు ఇదే మొదటి జనాభా లెక్కలు అవుతాయని, ఇందులో కుల గణన కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆన్లైన్ దశ తర్వాత, ఇంటింటి సందర్శనలు మరియు గోడలపై మార్కింగ్ చేయడంతో సహా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (HLO) మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం కోసం 21,866 మంది గణన సిబ్బందిని, 3,662 మంది పర్యవేక్షకులను నియమించనున్నారు.