TG FSL Recruitment : ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు - ఈనెల 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. జనవరి 20వ తేదీన నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే తాజాగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి మరో అప్డేట్ వచ్చింది. ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) తేదీలను ప్రకటించింది.

ఈనెల 20 నుంచి వెరిఫికేషన్
టీజీఎఫ్ఎస్ఎల్లోని పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 31వ తేదీతో ప్రాసెస్ పూర్తవుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, గచ్చిబౌలి, హైదరాబాద్ లో ఈ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది.
- ఇక అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్లను జనవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.
- ఉదయం 8 గంటల నుంచి జనవరి 19వ తేదీ వరకు ఇంటిమేషన్ లెటర్లను పొందవచ్చు.
- రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ www.tgprb.in నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఉదయం 9 గంటల నుంచే వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. ముందుగానే అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది.
- ఏమైనా ఇబ్బందులు వస్తే support@tslprb.in కు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు.
- మరిన్ని వివరాలకు 9391005006 నంబరుకు కాల్ చేయవచ్చు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
అభ్యర్థి వద్ద ఉండాల్సిన పత్రాలు:
- ఇంటిమేషన్ లెటర్
- ఆధార్ కార్డు
- అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ ఔట్
- టెన్త్ మెమో
- ఇంటర్ మెమో
- డిగ్రీ, పీజీ మార్కుల మెమో
- 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- ఇతర పత్రాలు
ఈ లింక్ పై క్లిక్ చేసి ఇంటిమేషన్ లెటర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

