...
...
Next Story

ఇక 1 నుంచి 12వ తరగతి వరకు ఒకటే.. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై 1 నుంచి 12వ తరగతి వరకు ఒకటే స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది.

Published on: Dec 11, 2025, 12:52:53 IST
Advertisement

తెలంగాణ పాఠశాల విద్యలో అతిపెద్ద మార్పులు రానున్నాయి. ఇప్పటిదాకా పదో తరగతి వరకు ఉన్న ఎస్ఎస్‌సీ బోర్డు, ఇంటర్ వరకు ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు రెండు కలిసి పోనున్నాయి. ఈ మేరకు 1 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047లో ఈ విషయాన్ని వెల్లడించింది.

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు
తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు

ప్రస్తుతం ఉన్న సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ బోర్డులను ఒకే అధికారంతో భర్తీ చేయడం ద్వారా తెలంగాణ తన పాఠశాల విద్యా వ్యవస్థను పునర్నిర్మించనుంది. కొత్త బోర్డు అన్ని వర్గాల పాఠశాలలకు విద్యా ప్రమాణాలు, నాణ్యతా నిబంధనలు, గుర్తింపును నిర్వహిస్తుందని ప్రభుత్వం తెలిపింది. డ్యూయల్-బోర్డు వ్యవస్థ నుండి వైదొలగాలని కేంద్రం రాష్ట్రాలకు చెబుతోంది.

ప్రాథమిక, యూపీఎస్, ఉన్నత పాఠశాలలు వంటి ఒకే ప్రాంతంలో పనిచేసే పాఠశాలలు ఒకే ప్రధానోపాధ్యాయుడి కింద ఒకే సంస్థలో విలీనం అవుతాయి. ఈ ఏకీకృత పాఠశాలలు అన్నమాట ప్రీ-ప్రైమరీ నుండి 10వ తరగతి వరకు తరగతులను అందిస్తాయి. హైస్కూల్‌గా మారుతుంది. విలీనం ముందు విద్యార్థులకు తగిన ప్రత్యామ్నాయాలు అందిస్తారు. దీని ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. ఒకే ప్రాంతం, ఒతే ప్రదేశంలో ఉన్న వివిధ పాఠశాలలు ఒకే గొడుగు కిందకు వస్తాయి.

ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో దశలవారీగా ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రవేశపెడుతుంది. సరిపడా ఉపాధ్యాయులను కూడా అందిస్తుంది. కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, వయస్సుకు తగిన ఏఐ అక్షరాస్యతతో పాటు పాఠశాల స్థాయి నుండి వృత్తి విద్యను ఏకీకృతం చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. పరీక్షా వ్యవస్థ, అభ్యాస అంచనా పద్ధతులను కూడా పునఃరూపకల్పన చేస్తారు.

ప్రభుత్వ DIET కళాశాలలను కొత్త ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయులు, ఇన్-సర్వీస్ సిబ్బంది కోసం కోర్సులను అందించే విద్యా కేంద్రాలుగా మారుస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నెట్‌వర్క్‌లను ప్రభుత్వం మరింత క్రీయాశిలకంగా చేయనుంది. దీనిద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెడుతుంది. అంతేకాదు ఎన్ఆర్ఐలను కూడా ఇందులో భాగం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe