మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయంలో రూ. 300 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరుద్ధరణ పనులను జనవరి 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హనుమకొండలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన శ్రీనివాస్ రెడ్డి.. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల స్థితిపై సమీక్షించారు. మేడారంలో దాదాపు 200 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా రాతి కట్టడాల వంటి శాశ్వత పనులను చేపట్టామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మేడారంలో రహదారుల విస్తరణ, యాత్రికుల సౌకర్యాల మెరుగుదల వంటి ఇతర అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, జనవరి 28 నుండి 31 వరకు జరిగే సమ్మక్క-సారక్క మహా జాతర కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
వరంగల్లోని వరద ముంపునకు గురయ్యే ప్రధాన పట్టణ ప్రాంతాల్లో నీటి కాలువల నిర్మాణం సహా పలు అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రూ. 4,000 కోట్లు మంజూరు చేశారని మంత్రి పొంగులేటి తెలిపారు. రూ. 570 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని, నగరంలో తాగునీటి సరఫరాను పెంచడానికి కూడా టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.
ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్కే ఇళ్లతో పాటు, దిగువ మధ్యతరగతి వర్గాల కోసం వరంగల్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.
భద్రకాళి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూడా అధికారులకు మంత్రి సూచించారు. రూ. 1,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 24 అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఈ సదుపాయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని చెప్పారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ త్వరలో పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
{{/usCountry}}భద్రకాళి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూడా అధికారులకు మంత్రి సూచించారు. రూ. 1,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 24 అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఈ సదుపాయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని చెప్పారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ త్వరలో పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
{{/usCountry}}గిరిజనులు, గిరిజనేతరుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క ఈ సందర్భంగా చెప్పారు. అందరినీ జాతరకు ఆహ్వాస్తున్నామన్నారు.