హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని పునరుద్ఘాటించారు. గతంలో రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా వారెవరూ ఈ ప్రాంతానికి రాలేదని, మీ గుండెల్లో స్థానం పొందడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఓవైసీ సోదరులను ఉద్దేశించి… ప్రశంసలు కురిపించారు,దేశభక్తి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వారిద్దరూ ఏమీ తక్కువ కాదని సీఎం వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన వంతెన (చంచల్గూడ నుంచి సంతోష్నగర్ ఫ్లైఓవర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సోదరులు దేశానికి వ్యతిరేకం అంటూ కొందరు చేస్తున్న విమర్శలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అలాంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం అంగీకరించబోనని చెప్పారు.
కార్గిల్ యుద్ధ సమయం లేదా ఆపరేషన్ సింధూర్ వంటి కీలక సందర్భాలలో భారత సైనికులకు మద్దతుగా తాము చేపట్టిన ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారని సీఎం గుర్తుచేశారు. ఆనాడు భారత ఆర్మీ విజయం సాధించాలని ఒవైసీ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారని తెలిపారు. వివిధ రాజకీయ వేదికలపై, విభిన్న అంశాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చని, కానీ దేశభక్తి విషయానికి వస్తే అసదుద్దీన్, అక్బరుద్దీన్లను ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పారు.
"వారు నిఖార్సయిన దేశభక్తులు. ఒక ముఖ్యమంత్రిగా, పూర్తి బాధ్యతతో ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. దేశాన్ని రక్షించే విషయంలో నరేంద్ర మోదీ, అమిత్ షాల కంటే వారు ఏమాత్రం తక్కువ కాదు. దేశ భద్రత, పరిరక్షణ విషయానికి వస్తే వారు ఎప్పటికీ వెనకడుగు వేయరు. ఎన్నికల్లో రాజకీయం వేరు, దేశభక్తి వేరు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షాలను, లేదా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఎంఐఎం ప్రయత్నించి ఉండవచ్చు. అది ఎన్నికల ప్రక్రియలో సహజంగా జరిగే రాజకీయ పోరాటం మాత్రమే" అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
ఇదే వేదికపై నుంచి ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఈ రెండు పార్టీలు అనవసర ఆటంకాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడమే కాకుండా, నగరంలో నైట్ టైమ్ ఎకానమీ పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే స్థానిక పేద ముస్లిం వర్గాలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
రేవంత్ రెడ్డి పాలనకు పూర్తి మద్దతు - అసదుద్దీన్
{{/usCountry}}ఇదే వేదికపై నుంచి ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఈ రెండు పార్టీలు అనవసర ఆటంకాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడమే కాకుండా, నగరంలో నైట్ టైమ్ ఎకానమీ పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే స్థానిక పేద ముస్లిం వర్గాలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
రేవంత్ రెడ్డి పాలనకు పూర్తి మద్దతు - అసదుద్దీన్
{{/usCountry}}ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఏ కాంగ్రెస్ పార్టీకో కాకుండా, రేవంత్ రెడ్డి అనే నాయకుడి నేతృత్వంలోని ప్రభుత్వానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు" అని అసదుద్దీన్ తేల్చిచెప్పారు. గతంలో తమ పార్టీ బీఆర్ఎస్కు కూడా మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలని తాము ఆకాంక్షిస్తున్నామని అసదుద్దీన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పాడవకుండా, మతతత్వం పెరగకుండా చూడాలని, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న ఉద్రిక్త పరిస్థితులు తెలంగాణలో రాకూడదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.