రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్ల తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కు సద్భావనా అవార్డును బహూకరించి సత్కరించారు.
తగ్గించాల్సిన అవసరం ఉంది - సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు. ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయ పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి రాజీవ్ గాంధీ చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గడిచిన 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా సద్భావనా యాత్ర సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుతున్న నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదమని వ్యాఖ్యానించారు. మూడు తరాలుగా దేశం కోసం గాంధీ కుటుంబం పనిచేస్తోందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీ కులగణన చేసి వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపించామని ఈ సందర్భంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. దేశ ఐక్యత కోసం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారన్నారు. ఆ సమయంలో తాను ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. పాత బస్తీకి మెట్రో గురించి ఎవరు ఆలోచన చేయలేదని… కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. కావాలనే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
{{/usCountry}}ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. దేశ ఐక్యత కోసం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారన్నారు. ఆ సమయంలో తాను ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. పాత బస్తీకి మెట్రో గురించి ఎవరు ఆలోచన చేయలేదని… కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. కావాలనే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
{{/usCountry}}