కష్టపడి, సర్వీసు ముగించుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ అధికారికి రిటైర్మెంట్కు ముందే నూరేళ్లు నిండాయి. ఏళ్ల తరబడి కలిసి ఉన్న భార్యే, ఆస్తులు, ఆర్థిక వివాదాల నేపథ్యంలో కాలయముడిగా మారింది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన వెంకటేశం కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా ఆసిఫాబాద్లో విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయన ఈ నెలలోనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాగా ఆయన మొదటి భార్య రాజమణి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎమ్గా పనిచేస్తోంది. వెంకటేశానికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య రాజమణితో గత కొంతకాలంగా ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలపై వివాదాలు నడుస్తున్నాయి.
త్వరలోనే వెంకటేశం పదవీ విరమణ చేయనుండటంతో ఆయనకు రాబోయే రిటైర్మెంట్ బెనిఫిట్స్ (పదవీ విరమణ ప్రయోజనాలు), ఇతర ఆస్తుల పంపకంపై దంపతుల మధ్య ఘర్షణ మొదలైంది. ఆదివారం హనుమాన్ నగర్లోని తమ నివాసంలో ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
మాటమాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజమణి, ఇంట్లోనే ఉన్న రాయితో వెంకటేశంపై తీవ్రంగా దాడి చేసింది. తలకు బలమైన గాయం కావడంతో ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వెంకటేశం చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితురాలు రాజమణిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
{{/usCountry}}సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితురాలు రాజమణిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
{{/usCountry}}జీవిత చరమాంకంలో తోడుగా ఉంటూ ఒకరికొకరు ఆసరాగా నిలవాల్సిన భార్యాభర్తలు, ఆస్తుల కోసం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కాసుల కక్కుర్తి ముందు దశాబ్దాల దాంపత్య బంధం, ప్రేమానురాగాలు ఓడిపోయాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఉద్యోగ విరమణ చేసి ప్రశాంతంగా గడపాల్సిన ఒక అధికారి, కట్టుకున్న భార్య చేతిలోనే దారుణంగా హత్యకు గురి అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.