రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా… ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఇందులో కొన్నిచోట్ల కాంగ్రెస్ కు ఆధిక్యం రాగా… మరికొన్నిచోట్ల బీఆర్ఎస్, బీజేపీలకు వచ్చాయి. ఇక ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో…. కాంగ్రెస్ పార్టీ పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల పాగా వేసింది.
కాంగ్రెస్ హవా…!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో అతి తక్కువ స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది.
ఇక మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ, డోర్నకల్ మునిప్రాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీతో పాటు మధిర మున్సిపాలిటీపై కూడా హస్తం జెండా ఎగిరింది. హుస్నాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది. ఇక్కడ మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు.
మరోవైపు కొన్నిచోట్ల బీఆర్ఎస్ కూడా విజయం సాధించింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీని ఖాతాలో వేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డిపోతారం, గుమ్మడిదల, గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటిలపై కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీని తన ఖాతాలోకి వేసుకుంది. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బోణీ తెరిచిన జనసేన…
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన కూడా బోణీ తెరిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 300కిపైగా స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది.
రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లతో పాటు 116 మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది. వీటికి సంబంధించిన ఓట్లను ఇవాళ లెక్కిస్తున్నారు. సాయంత్రం వరకల్లా అన్ని ఫలితాలు వెలువడనున్నాయి.
ర్యాలీలపై ఆంక్షలు…
{{/usCountry}}రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లతో పాటు 116 మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది. వీటికి సంబంధించిన ఓట్లను ఇవాళ లెక్కిస్తున్నారు. సాయంత్రం వరకల్లా అన్ని ఫలితాలు వెలువడనున్నాయి.
ర్యాలీలపై ఆంక్షలు…
{{/usCountry}}ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున… శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజేతలు తమ సంబరాల కోసం మరో రోజును కేటాయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.