LPG Cylinders : గ్యాస్ సిలిండర్ ఏజెన్సీల దగ్గర నిఘా పెట్టండి - సీఎస్ ఆదేశాలు
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని, పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో LPG నిల్వలు, గ్యాస్ వినియోగదారులకు పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించి… పలు సూచనలు చేశారు.

నిఘా పెట్టండి - సీఎస్ రామకృష్ణారావు
రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా, నిల్వలు, రవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ……. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజువారీ సమీక్ష, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు, ఎజెన్సీల దగ్గర పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.29 కోట్ల గృహ వినియోగదారుల కనెక్షన్లు ఉన్నాయని….. ప్రస్తుత డిమాండ్ కు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లు కు డిమాండ్ మేరకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చేందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, శాఖ అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 810 డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నాయని అన్నారు. వినియోగదారులకు సకాలంలో డెలివరీ జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమయానికి సరఫరా అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో HPCL, IOCL, BPCL మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











