హైదరాబాద్ రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా చేపడుతున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణంలో దాదాపు రూ.1700 కోట్ల విలువైన ఏడెకరాల ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీలకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీవ్రంగా ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ధర సుమారు రూ. 250 కోట్లు ఉంటే, అక్కడ ఉన్న ఏడెకరాల స్థలాన్ని టెండర్లు, అగ్రిమెంట్లు లేకుండా వంశీరామ్, అపర్ణ బిల్డర్స్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధారాదత్తం చేసిందని దాసోజు శ్రావణ్ విమర్శించారు.
ప్రతి రాష్ట్రంలో స్థానిక ఉత్పత్తుల విక్రయాల కోసం పీఎం ఏక్తా మాల్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని కేటాయించింది. కానీ ఈ ప్రాజెక్ట్ను రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. ఈ మాల్లో మొత్తం 27 లక్షల చదరపు అడుగుల (27 అంతస్తులు) నిర్మాణం జరుగుతుంటే, ప్రభుత్వానికి కేవలం 9 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఇచ్చి, మిగిలిన 18 లక్షల చదరపు అడుగుల విలువైన ప్రాపర్టీని ప్రైవేటు బిల్డర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
ఈ నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్ కానీ, టెండర్ డాక్యుమెంట్లు కానీ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేవని శ్రావణ్ వెల్లడించారు. 'తెలంగాణ అమరవీరుల సాక్షిగా సవాల్ చేస్తున్నాం.. నిజాయితీ ఉంటే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ టెండర్లను రద్దు చేసి, బహిరంగ చర్చకు రావాలి.' అని దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి అర్హత లేకపోయినా ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చైర్మన్ను చేసి, వందల కోట్ల విలువైన భూములను కేటాయించారని ఆరోపించారు. అనకొండలా రాష్ట్ర సంపదను మింగేస్తున్న రేవంత్ కుటుంబం వేల కోట్ల కమీషన్లు దండుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి అర్హత లేకపోయినా ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చైర్మన్ను చేసి, వందల కోట్ల విలువైన భూములను కేటాయించారని ఆరోపించారు. అనకొండలా రాష్ట్ర సంపదను మింగేస్తున్న రేవంత్ కుటుంబం వేల కోట్ల కమీషన్లు దండుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}కేంద్ర ప్రాజెక్టు పరిధిలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు నోరు మెదపడం లేదని శ్రావణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై చిల్లర దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. 'ఒకవైపు పేదవారు ఇండ్లు కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న ఈ ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులకు మాత్రం కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతోంది. టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులతో పాటు రాయదుర్గంలో జరుగుతున్న భూ దోపిడీపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుంది.' అని స్పష్టం చేశారు.