గత 11 నెలల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద తెలంగాణలో 51,112 కొత్త ఎల్పీజీ కనెక్షన్లను భారత ప్రభుత్వం కల్పించిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభకు తెలిపారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత నాలుగేళ్లలో ఏ ఏడాదిలోనూ లేనంతగా ఈ కాలంలో కనెక్షన్ల పంపిణీ ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు.

PMUY పథకం ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వంటచెరకు వంటి సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ ఫలితాలు కూడా మెరుగుపడతాయని కేంద్రం భావిస్తోంది
చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్
మరోవైపు తెలంగాణలో వంటగ్యాస్ కొరతపై శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ తక్షణమే చర్చ జరపాలని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) శాసనసభ పక్షం డిమాండ్ చేసింది. ఈ కొరత సామాన్య ప్రజలను, చిన్న వ్యాపారులను, పలు సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నందున, ఈ సమస్యను తక్షణమే చేపట్టాలని కోరుతూ వాయిదా తీర్మానాలను సమర్పించినట్లు పార్టీ తెలిపింది.
సకాలంలో గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల గృహాలు వంట చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అదే సమయంలో చిన్న వ్యాపారాలు, హోటల్ నిర్వాహకులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
వృద్ధాశ్రమాలు, హాస్టళ్లు, ఇలాంటి సంక్షేమ సంస్థలు కూడా నివాసితులకు ఆహారం తయారు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ కోరింది. ప్రజలకు మరింత ఇబ్బంది కలగకుండా నివారించడానికి తక్షణ జోక్యం అవసరమని పేర్కొంది. ఈ విషయాన్ని శాసనసభలో ఆలస్యం లేకుండా చర్చించాలని, గ్యాస్ పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలని నొక్కి చెప్పింది.
ఎల్పీజీ కొరత లేదు : సజ్జనార్
హైదరాబాద్ నగరంలో ఇంధనం లేదా ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఎక్స్లో ఒక పోస్ట్లో సజ్జనార్ మాట్లాడుతూ.. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, నగరం అంతటా సరఫరా సజావుగా సాగుతోందని చెప్పారు.
{{/usCountry}}హైదరాబాద్ నగరంలో ఇంధనం లేదా ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఎక్స్లో ఒక పోస్ట్లో సజ్జనార్ మాట్లాడుతూ.. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, నగరం అంతటా సరఫరా సజావుగా సాగుతోందని చెప్పారు.
{{/usCountry}}'ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. ఇంధన కేంద్రాల వద్ద తొందరపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేస్తే.. అనవసరమైన రద్దీ, అంతరాయాలకు దారితీస్తుంది.' అని సజ్జనార్ అన్నారు.
సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో హైదరాబాద్ నగర పోలీసులు ఎల్పీజీకి సంబంధించిన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని, వదంతులను వ్యాప్తి చేయడం లేదా తప్పుడు మాటలను నమ్మడం మానుకోవాలని, సాధారణ పరిస్థితులు కొనసాగేలా అధికారులకు సహకరించాలని కోరారు.