హైదరాబాద్ గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రహదారికి "డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవించబడిన మొదటి అమెరికా అధ్యక్షుడిని తానేనని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్ ఆనుకుని ఉన్న రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

ఈ వారం ప్రారంభంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారతదేశంలో యూఎస్ రాయబారి సెర్గియో గోర్ సంయుక్తంగా అధికారిక నామఫలకాన్ని ఆవిష్కరించిన ఫోటోను ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'భారతదేశంలోని హైదరాబాద్లో సరికొత్త డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ - ఈ విధంగా గౌరవం పొందిన మొట్టమొదటి యూఎస్ ప్రెసిడెంట్. థాంక్యూ!' అని రాసుకొచ్చారు.
హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ సైతం ఈ పరిణామంపై ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. 'హైదరాబాద్లో ఇదొక చారిత్రాత్మక క్షణం! తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రహదారిని అధికారికంగా ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా మారుస్తూ నామఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అద్భుతమైన గుర్తింపునకు తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనం.' అని కాన్సులేట్ పేర్కొంది.
కొత్తగా పేరు మార్చిన ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజాల కార్యాలయాలకు అత్యంత సమీపంలో ఉంది. ఈ నామకరణం యునైటెడ్ స్టేట్స్కు ఇచ్చే గౌరవమని, అలాగే భారత్-యూఎస్ సంబంధాలలో హైదరాబాద్ ఎదుగుతున్న పాత్రకు లభించిన గుర్తింపు అని తెలంగాణ ప్రభుత్వం అభివర్ణించింది.
తెలంగాణ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 'వావ్! జస్ట్ వావ్!! ప్రెసిడెంట్ ట్రంప్ భారతీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని రాహుల్ గాంధీ అంటారు. కానీ తెలంగాణలోని ఆయన ప్రభుత్వమేమో ట్రంప్ పేరును ఒక రహదారికి పెట్టి ఆయనకు అల్టిమేట్ ట్రిబ్యూట్ ఇస్తుంది! ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరయ్యారు, ఈ నిర్ణయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు.' అని పూనావాలా ఎక్స్లో ప్రశ్నించారు.
{{/usCountry}}తెలంగాణ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 'వావ్! జస్ట్ వావ్!! ప్రెసిడెంట్ ట్రంప్ భారతీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని రాహుల్ గాంధీ అంటారు. కానీ తెలంగాణలోని ఆయన ప్రభుత్వమేమో ట్రంప్ పేరును ఒక రహదారికి పెట్టి ఆయనకు అల్టిమేట్ ట్రిబ్యూట్ ఇస్తుంది! ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరయ్యారు, ఈ నిర్ణయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు.' అని పూనావాలా ఎక్స్లో ప్రశ్నించారు.
{{/usCountry}}తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ మాటలను సీరియస్గా తీసుకోవడం లేదని పూనావాలా ఎద్దేవా చేశారు. 'రాహుల్ బాబా మాటలను రేవంత్ రెడ్డి అస్సలు పట్టించుకోరా? గతంలో రాహుల్ అదానీ అదానీ అని జపిస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి అలాగే చేశారు.. నేరుగా వెళ్లి అదానీ గ్రూప్తో ఎంఓయూ కుదుర్చుకున్నారు.' అని పూనావాలా రాశారు.