చలికాలం ఎఫెక్ట్.. ఈ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల టైమింగ్స్లో మార్పులు, ఉత్తర్వులు జారీ!
తెలంగాణలో కొన్ని రోజులుగా విపరీతమైన చలి ఉంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ టైమింగ్స్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా విపరీతమైన చలి ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ గజ గజ వణికిపోతుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల సమయాలను సవరించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తరగతులు ఉదయం ఆలస్యంగా ప్రారంభమవుతాయి. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

చలి వాతావరణం కారణంగా విద్యార్థుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి ఉదయం 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు కాకుండా ఉదయం 9.40 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలు సమయాలను తక్షణమే పాటించాలని ఆదేశించారు. సూచనలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించనున్నట్టుగా తెలిపారు.
కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలోని కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. భీమ్పూర్ మండలంలోని అర్లి (T) గ్రామంలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 7.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. డిసెంబర్ 11న ఇది 5.4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. ఇంత చలిలో ఉదయంపూట పాఠశాలలకు త్వరగా వెళ్లాలంటే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరో నాలుగు రోజులు
తెలంగాణలో చలిగాలులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి, అనేక ప్రాంతాల్లో సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ అత్యంత శీతల ప్రాంతంగా మారింది. డిసెంబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శీతల గాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా ఆసిఫాబాద్ అత్యంత శీతల ప్రదేశంగా ఉంది. ఇక్కడ 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. తరువాత సంగారెడ్డి (6.4 డిగ్రీలు), రంగారెడ్డి (6.5 డిగ్రీలు) ఉన్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఇతర జిల్లాలు ఆదిలాబాద్ (7.7 డిగ్రీలు), వికారాబాద్, సిద్దిపేట (8.1 డిగ్రీలు), మెదక్ (8.5డిగ్రీలు), కామారెడ్డి (8.6డిగ్రీలు), నిజామాబాద్ (9.1 డిగ్రీల).
ఈ రాత్రి నుండి చలిగాలులు మరింత తీవ్రమవుతాయని, ఉత్తర, పశ్చిమ తెలంగాణ అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు 5-7 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే 24-48 గంటల్లో హైదరాబాద్లో 7 నుంచి 9 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


