...
...
Next Story

Train Cancellation Alert : ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - కాచిగూడ నుంచి నడిచే ఈ రైళ్లన్నీ రద్దు, లిస్ట్ ఇదే

రైల్వే ప్రయాణికులకు దక్షిమ మధ్య రైల్వే ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. కాచిగూడ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసింది.

Published on: Apr 08, 2026 08:17 AM IST
Advertisement

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. మొత్తం 12 రైళ్లు పలు తేదీల్లో రద్దయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

రద్దు చేసిన రైళ్ల వివరాలు :

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ (image source @GMSRailway)
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ (image source @GMSRailway)

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్లే ( నంబర్ 67781)ను ఏప్రిల్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు.

  • మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకు నడిచే రైలు (నంబర్ 67782)ను ఏప్రిల్ 11 నుంచి 19వ తేదీ వరకు రద్దు చేశారు.
  • కాచిగూడ నుంచి రాయచూర్ కు వెళ్లే రైలు (నంబర్ 67787)ను ఏప్రిల్ 11 నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు.
  • రాయచూర్ నుంచి కాచిగూడకు ప్రయాణించే రైలు (నంబర్ 67788)ను ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు.
  • గుంతకల్లు - బోధన్ మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 57411) ట్రైన్ ను ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 18 వరకు రద్దు చేశారు.
  • కాచిగూడ - గుంతకల్లు (57412) మధ్య నడిచే ట్రైన్ ను ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు రద్దు చేశారు.
  • కాచిగూడ - కర్నూల్ సిటీ మధ్య నడిచే (నెంబర్ 17435) రైలును.. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు రద్దు చేశారు.
  • కర్నూల్ సిటీ నుంచి కాచిగూడ మధ్య నడిచే(17436) రైలును ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు రద్దు చేశారు.
  • కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య నడిచే (77641) రైలును ఏప్రిల్ 11 నుంచి 18వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు.
  • మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ మధ్య నడిచే (77641) ట్రైన్ ను ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు రద్దు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe