హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు, స్కూళ్లకు సెలవు!

హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానికంగా జనాలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు విద్యాసంస్థలు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి.

Published on: Feb 10, 2026 4:20 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలో భూప్రకంపనలు సంభవించాయని స్థానికులు పేర్కొన్నారు. మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పలు ప్రాంతాల్లో ఉదయం స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇది భూకంపమేనా? లేదంటే ఇతర పేలుళ్ల కారణంగా భూ ప్రకంపనలు సంభవించాయా? తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో భూప్రకంపనలు
హైదరాబాద్‌లో భూప్రకంపనలు

గాజులరామారంలోని మెట్ కాన్ గూడ నివాసితులు మంగళవారం కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలను అనుభవించారు. ఇది పరిసర ప్రాంతాలలో భయాందోళనలను రేకెత్తించింది. ఆకస్మికంగా భూమి కంపించినట్టుగా అనిపించడంతో భయపడ్డ చాలా మంది జనాలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. పొరుగువారిని ఏం జరిగిందని అడగుతూ భయపడ్డారు. భూ ప్రకంపనల ప్రభావం అనేక శివారు ప్రాంతాలలో ఉందని, భూమి కొద్దిసేపు కంపించిదని మరికొందరు చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజులరామారం డివిజన్‌లోని మెట్ కాన్ గూడ ప్రాంతంతో సహా పలు ప్రాంతాల్లో భూకంప కార్యకలాపాలు నమోదయ్యాయి. ఉదయం 10:10 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా మంది భయపడ్డారు.

పెద్ద శబ్దంతో భూమి కంపించిందని, ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో నివాసితులలో ఆందోళన మరింత పెరిగింది. ఈ సంఘటన కొన్ని సేకన్లపాటు జరిగింది. ఇంట్లోని వస్తువులు కదిలాయని, కుటుంబాలు వెంటనే బయటకు పరుగులు తీశాయని స్థానికులు తెలిపారు. భూకంపం వల్ల సంభవించిందా లేక ఏదైనా పేలుడు వల్ల సంభవించిందా? అనే దానిపై తెలియాల్సి ఉంది. భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని స్థానికులు చెబుతున్నారు. పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల నుండి భయంతో బయటికి పరుగులు తీశామని చెప్పారు. భూకంపం సంభవించినట్లు మాత్రం అధికారులు కన్ఫామ్ చేయలేదు.

పాఠశాలలకు సెలవులు

ఈ సంఘటన తర్వాత సమీపంలోని విద్యా సంస్థల యాజమాన్యాలు ముందుజాగ్రత్తలో బాగంగా సెలవు ప్రకటించాయి. అయితే ఈ సంఘటన గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. నివాసితులు అందించిన సమాచారం ఆధారంగా, అధికారులు మెట్ కాన్ గూడకు చేరుకుని అధ్యయనాన్ని ప్రారంభించారు. ఆకస్మిక ప్రకంపనలకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.