ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక విమానాన్ని వేలం వేసింది. రూ. 792 కోట్ల నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా, సీజ్ చేసిన 'హాకర్ 800A' ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ రూ. 3 కోట్లకు విజయవంతంగా విక్రయించింది. హైదరాబాద్కు చెందిన 'క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్' (ఫాల్కన్ గ్రూప్), దాని ప్రమోటర్లపై నమోదైన కేసులో భాగంగా ఈ విమానాన్ని జప్తు చేశారు. జూలై 1, 2026 న ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో MSTC ప్లాట్ఫారమ్ ద్వారా ఈ వేలం ప్రక్రియ నిర్వహించారు.
2025లో శంషాబాద్ విమానాశ్రయంలో జప్తు

ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(PMLA) నిబంధనల ప్రకారం, 2025 మార్చి 7న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో ఈ ప్రైవేట్ జెట్ను సీజ్ చేశారు. అనంతరం 2025 ఆగస్టులో పిఎంఎల్ఎ అడ్జుడికేటింగ్ అథారిటీ ఈ జప్తును ధృవీకరించింది.
ఆ తర్వాత 2025 నవంబర్లో ఈ జెట్ విమానాన్ని విక్రయించడానికి ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ నుండి ప్రత్యేక అనుమతి పొందింది. పిఎంఎల్ఎ రూల్స్-2013 ప్రకారం దీనికి అనుమతి లభించడంతో, ఈడీ చరిత్రలోనే ఇది మొదటి ఎయిర్క్రాఫ్ట్ వేలంగా రికార్డు సృష్టించింది.
రూ. 792 కోట్ల నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసం
సైబరాబాద్ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్(EOW) క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్, ఇతరులపై నమోదు చేసిన మూడు కేసుల ఆధారంగా ఈ మనీ లాండరింగ్ దర్యాప్తు ప్రారంభమైంది.
వివిధ వ్యాపార సంస్థలు కొనుగోలు చేసిన ఇన్వాయిస్లను డిస్కౌంట్ ధరకు సెటిల్ చేస్తామంటూ, పెట్టుబడిదారులకు భారీ లాభాలు ఆశ చూపి ఈ సంస్థ మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సంస్థకు ఎలాంటి నిజమైన ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారం లేదని, కేవలం అబద్ధపు వాగ్దానాలతో పెట్టుబడిదారుల నుండి భారీగా నిధులు వసూలు చేశారని ఈడీ స్పష్టం చేసింది.
ఈ స్కీమ్ ద్వారా దాదాపు రూ. 792 కోట్లు వసూలు చేసి, ఆ నిధులను వ్యాపారంతో సంబంధం లేని ఇతర అవసరాలకు మళ్లించారు. ఈ అక్రమ సొమ్ముతో అసోసియేట్లు, బినామీల పేర్లపై వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. పెట్టుబడిదారులు తమ డబ్బును తిరిగి పొందలేక మోసపోయామని గ్రహించి సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ను ఆశ్రయించడంతో ఈ కేసులు నమోదయ్యాయి.
ముగ్గురి అరెస్ట్.. బాధితులకు నిధుల వాపస్
{{/usCountry}}ఈ స్కీమ్ ద్వారా దాదాపు రూ. 792 కోట్లు వసూలు చేసి, ఆ నిధులను వ్యాపారంతో సంబంధం లేని ఇతర అవసరాలకు మళ్లించారు. ఈ అక్రమ సొమ్ముతో అసోసియేట్లు, బినామీల పేర్లపై వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. పెట్టుబడిదారులు తమ డబ్బును తిరిగి పొందలేక మోసపోయామని గ్రహించి సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ను ఆశ్రయించడంతో ఈ కేసులు నమోదయ్యాయి.
ముగ్గురి అరెస్ట్.. బాధితులకు నిధుల వాపస్
{{/usCountry}}ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసింది. అమర్దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సీఈఓ ఆర్యన్ సింగ్ ఛాబ్రాలను అధికారులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2025లోనే ప్రత్యేక పిఎంఎల్ఎ కోర్టులో ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కూడా దాఖలు చేసింది.
ప్రైవేట్ జెట్ వేలం ద్వారా వచ్చిన రూ. 3 కోట్ల సొమ్మును బాధితులకు పరిహారంగా పంపిణీ చేయనున్నారు. అయితే దీనికి ప్రత్యేక పిఎంఎల్ఎ కోర్టు నుండి తుది అనుమతి రావాల్సి ఉంది. ఈ భారీ మోసానికి సంబంధించిన దర్యాప్తు, అలాగే అక్రమంగా సంపాదించిన మరికొన్ని ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఈడీ తెలిపింది.