TG TET Notification 2025 : 'టెట్' నిర్వహణపై కసరత్తు - త్వరలో నోటిఫికేషన్...! ఇదిగో తాజా అప్డేట్

టీజీ టెట్ ప్రకటన విడుదలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.  ఎగ్జామ్ నిర్వహణపై ప్రతిపాదనలు కూడా పంపింది. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఆ వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Published on: Nov 09, 2025 12:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే… వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది.

టీజీ టెట్ ఎగ్జామ్ 2025
టీజీ టెట్ ఎగ్జామ్ 2025

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జూన్ నోటిఫికేషన్ పూర్తి అయింది. మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఏపీలో నోటిఫికేషన్ జారీ కావటంతో పాటు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డిసెంబర్ లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

ఇప్పటికే టెట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను కూడా ఇచ్చింది. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వం టీచర్లు సైతం ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టెట్‌ జీవోలో సవరణ చేసి నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది.

గ్రీన్ సిగ్నల్ ఇస్తే నోటిఫికేషన్…!

మరోవైపు టెట్ ఎగ్జామ్ పై రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో…. వీరంతా కూడా ఎగ్జామ్ రాయాల్సి పరిస్థితి ఏర్పడింది. వీరి సంఖ్య 45 వేలకుపైగా ఉంటుందని అంచనా. ఈ అంశంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని… విద్యాశాఖ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు.

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయటానికి వీలవుతుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైతే ఇందుకు సంబంధించిన సమాచారం, సిలబస్ వివరాలను https://schooledu.telangana.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.