నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) మృతి చెందారు. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం), గుండెపోటు సంబంధిత సమస్యలతో హైదరాబాద్ సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం తెల్లవారుజామున 12:51 గంటలకు కన్నుమూశారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
జులై 26 నుంచి చికిత్స…

జూలై 26న హనుమకొండలోని స్వగృహంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, పల్మనరీ ఎంబోలిజం వ్యాధితో బాధపడుతున్న ఆయనకు యశోద ఆసుపత్రి నిపుణుల బృందం వెంటిలేటర్ సపోర్ట్పై అధునాతన వైద్య చికిత్స అందించింది. తొలత పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత ఆరోగ్యం వేగంగా క్షీణించి తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి, విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా, నమ్మకమైన భాగస్వామిగా నిలిచారు.
- 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని వేగవంతం చేశారు.
- 2002లో పార్టీ రాష్ట్ర కన్వీనర్గా నియమితులయ్యారు.
- 2004లో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు.ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.తదనంతర కాలంలో టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
- వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సుదర్శన్ రెడ్డి… తెలంగాణ పౌర సరఫరాల సంస్థ (Civil Supplies Corporation) ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
- 2014 ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుదర్శన్ రెడ్డి…. 2019 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు.
సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.
{{/usCountry}}సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.
{{/usCountry}}