విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.

నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహారి, సలహాదారులు కే కేశవ రావు, వీ.హనుమంత రావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్తోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 'ఫీజులు కట్టలేదని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపడానికి వీలులేదు. విద్యార్థులు అడక్కుండానే వారి ఖాతాలో డబ్బులు వేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో సిద్ధంగా పెడుతున్నాం. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసి, ప్రతి ఏటా రూ. 2,400 కోట్లు విద్యార్థుల ఖాతాల్లో వేసి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.' అని తెలిపారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు వచ్చేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు వస్తాయన్నారు. అందుకే నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య, ఆ తర్వాత స్కిల్స్ నేర్పాలన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి ఈ సమాజం రెడ్ కార్పెట్ పరుస్తుందని చెప్పారు. కేవలం సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో.. చెప్పలేమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
'ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఏటీసీలు, పాలిటెక్నిక్, స్కిల్ యూనివర్సిటీ ఇతర సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోండి. ఆడపిల్లలు నర్సింగ్ చదువుకుంటే రూ. 2 లక్షలతో జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు చదువుల్లో పోటీ పెరిగింది. చాలా మందికి 90 శాతం పైగా మార్కులు వస్తున్నాయి. చదువు మాత్రమే కాదు. సాంకేతిక నైపుణ్యంలో రాణించే వారూ ఉంటారు. కొందరు క్రీడల్లో రాణించే వారుంటారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
{{/usCountry}}'ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఏటీసీలు, పాలిటెక్నిక్, స్కిల్ యూనివర్సిటీ ఇతర సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోండి. ఆడపిల్లలు నర్సింగ్ చదువుకుంటే రూ. 2 లక్షలతో జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు చదువుల్లో పోటీ పెరిగింది. చాలా మందికి 90 శాతం పైగా మార్కులు వస్తున్నాయి. చదువు మాత్రమే కాదు. సాంకేతిక నైపుణ్యంలో రాణించే వారూ ఉంటారు. కొందరు క్రీడల్లో రాణించే వారుంటారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
{{/usCountry}}యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని అందిస్తామని చెప్పారు. మీరూ క్రీడల్లో రాణించండి. రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించండి. దేశ స్థాయిలో గౌరవాన్ని తీసుకురాండి. ఒలంపిక్స్లో మెడల్స్ సాధించండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి.. నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
కేవలం చదువుకుంటేనే బతుకులు మారుతాయని, చదువుకుంటేనే మన తలరాతలు మారుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అవకాశాల కోసం పోటీ పడాలన్నారు.
'కులాల మధ్య అంతరాలను తగ్గించడానికి అన్ని వర్గాలు ఒకే చోట కలిసిమెలిసి జీవించడమనే లక్ష్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నాం. జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే లాంటి మహనీయుల జీవిత విశేషాలను వివరిస్తూ విగ్రహాలు చేయడం ఏర్పాటు కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించడానికి కాదు. గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలు, వారి గొప్పతనాన్ని విగ్రహాల ద్వారా స్ఫూర్తి పొందడానికి వేదికలుగా నిలుస్తాయి.' అని అన్నారు.