కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాలు చోరీ
కట్టుదిట్టమైన భద్రత ఉండే కంటోన్మెంట్లో ఆయుధాలు అపహరణ కావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు గది తాళం పగలగొట్టి మెుత్తం 12 ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ నుండి 12 ఆయుధాలు చోరీకి గురైనట్లు సైనిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయుధాలను భద్రపరిచిన గది తాళాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి వాటిని తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

సైనిక అధికారులు మల్కాజిగిరిలోని బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇది ఒక రక్షణ సంస్థకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఆయుధాల చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్రపై సైనికాధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ దళాల శిక్షణా సంస్థకు అనుబంధంగా అనేక రెజిమెంట్లు పనిచేస్తున్నాయి. మద్రాస్ రెజిమెంట్ వాటిలో ఒకటి, సైనిక సిబ్బంది ఆయుధాలను నిల్వ చేసే ఒక విభాగం ఇక్కడ ఉంది. ఇది చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుంది.
ఈ విభాగంలోకి ఎవరికి పడితే వారికి ప్రవేశం ఉండదు. సంబంధిత వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆదివారం రాత్రి సైనిక అధికారులు ఈ చోరీని గుర్తించినట్టుగా తెలుస్తోంది. గల్లంతైన ఆయుధాల్లో నాలుగు ఏకే-47, ఆరు పిస్టళ్లు, ఒక (ఇన్సాస్) రైఫిల్, మందుగుండు సామగ్రిగా గుర్తించారు. మెుత్తం 12 ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించారు. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆ ప్రాంతంలోకి బయటివారికి ప్రవేశం లేనందున సిబ్బందిలో ఒకరి ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మద్రాస్ రెజిమెంట్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో ఆర్మీ అధికారులు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు చెందిన సీనియర్ అధికారులు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటనలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణానికి నాలుగు గేట్లు ఉన్నాయి. ఆర్మీ అధికారులు, సైనికులు, అథరైజ్డ్ వ్యక్తులు తప్ప ఇతరులు ప్రాంగణంలోకి ప్రవేశించలేరు. ఇలాంటి నిషేధిత ప్రాంతం నుంచి ఆయుధాల దొంగతనం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆయుధాల బరువు కారణంగా వాటిని ఒక్కరే మోసుకెళ్లి ఉండరని పోలీసులు అనుమానిస్తున్నారు.
కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానితులు ఆయుధాల నిల్వ గదికి చేరుకోగలిగారు కాబట్టి, వారికి ఆ ప్రాంగణం గురించి ముందే తెలిసి ఉండే అవకాశం ఉందని కూడా వారు భావిస్తున్నారు. సీనియర్ పోలీస్ అధికారులు మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణానికి చేరుకుని, సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సమాచారం సేకరించేందుకు ఆర్మీ అధికారులు సిబ్బందిలో అంతర్గత విచారణ కూడా జరుపుతున్నారని సమాచారం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


