cw ఆస్తి పన్నుదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తాజా ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించిన పెండింగ్ బకాయిలను మార్చి 31వ తేదీలోపు క్లియర్ చేస్తే రాయితీ ఇవ్వనుంది. వడ్డీపై 90 శాతం రాయితీ(డిస్కౌంట్) ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
వడ్డీపై 90 శాతం డిస్కౌంట్…

ఆస్తిపన్ను చెల్లింపుదారులు జీహెచ్ఎంసీ అధికారిక వెబ్సైట్ ghmc.gov.in ద్వారా లేదా MyGHMC , MyCURE వంటి మొబైల్ యాప్ల ద్వారా ఆన్లైన్లో సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. మీ-సేవా కేంద్రాలు , సిటిజన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి కూడా బకాయిలు చెల్లించి ఈ 90 శాతం వడ్డీ రాయితీని పొందవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.
చాలా మంది ఆస్తి పన్నులను క్లియర్ చేయకుండా ఉంటారు. ఇది కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి… చాలా డబ్బులు కట్టాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. అయితే ఇలాంటి వారు ఈ ఓటీఎస్(వన్ టైమ్ సెటిల్ మెంట్) ద్వారా పేరుకుపోయిన బకాయిలను తక్కువ డబ్బులు చెల్లించి క్లియర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
అయితే ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31వ తేదీన గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఇటువంటి రాయితీలు ఉండకపోవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేసింది. త్వరితగతిన పన్ను కట్టాలని సూచిస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా నగర ప్రజలు తమ బాధ్యతను నెరవేర్చడమే కాకుండా, నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను - వెబ్ సైట్లు:
- http://ghmc.gov.in
- మై క్యూఆర్ యాప్
- మీసేవా కేంద్రా
- సిటిజన్ సర్వీస్ సెంటర్స్