గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను పరిష్కారం అనే ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది పౌరుల ఆస్తి పన్ను సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి మార్చి నెలాఖరు వరకు ప్రతి ఆదివారం నిర్వహిస్తారు. ప్రాపర్టీ ట్యాక్య్ పరిష్కారం పేరుతో నడుస్తుంది.

జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఈ కార్యక్రమం మార్చి 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నగరంలోని అన్ని సర్కిల్ కార్యాలయాలలో నిర్వహిస్తారు. డిప్యూటీ కమిషనర్లు, వాల్యుయేషన్ అధికారులు/అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు ఫిర్యాదులను నేరుగా స్వీకరించడానికి, పరిష్కరించడానికి హాజరవుతారు.
ఈ ప్రోగ్రామ్ రివిజన్ పిటిషన్లను వేగవంతం చేయడం, ఆస్తి పన్ను అసెస్మెంట్ల సరిదిద్దడం, బిల్ కలెక్టర్లు, ఆర్టీజీఎస్, ఆన్లైన్ పద్ధతుల ద్వారా చేసిన చెల్లింపులను పోస్ట్ చేయడం, బకాయిల దిద్దుబాటు, నిబంధనల ప్రకారం కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సంబంధిత విషయాలు, స్వీయ-అంచనా సమస్యలు, ఇతర పన్ను సంబంధిత సమస్యలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక ప్రకటనలో జీహెచ్ఎంసీ తెలిపింది.
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రతి కేంద్రంలో కంప్యూటర్లు, ఆన్లైన్ కనెక్టివిటీ, ప్రింటర్లతో కూడిన మూడు ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులకు మార్గనిర్దేశం చేయడానికి, అవసరమైన ఫారమ్లను అందించడానికి, సమర్పణలను క్రమబద్ధీకరించడానికి ఒక రిసెప్షన్ కౌంటర్ కూడా ఉంది.
తగిన ధృవీకరణ తర్వాత రివిజన్ పిటిషన్ల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కమిషనర్ గతంలో జారీ చేసిన అధికారాల ప్రకారం.. అనుగుణంగా ఆన్లైన్ దిద్దుబాట్లు నిర్వహించాలి. సిబ్బందికి స్పష్టమైన బాధ్యతలను అప్పగించాలని, సమయపాలనకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.
చట్టపరమైన కేసులపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారు. కోర్టు ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా సాధ్యమైన పరిష్కారం కోసం పిటిషనర్లు కార్యక్రమానికి హాజరు కావాలని ప్రోత్సహిస్తారు. సూచించిన ఫార్మాట్లో రోజువారీ నివేదికలను రెవెన్యూ విభాగానికి సమర్పించి, అప్డేట్ చేస్తారు. దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో జాప్యాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కార్పొరేషన్ హెచ్చరించింది.
{{/usCountry}}చట్టపరమైన కేసులపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారు. కోర్టు ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా సాధ్యమైన పరిష్కారం కోసం పిటిషనర్లు కార్యక్రమానికి హాజరు కావాలని ప్రోత్సహిస్తారు. సూచించిన ఫార్మాట్లో రోజువారీ నివేదికలను రెవెన్యూ విభాగానికి సమర్పించి, అప్డేట్ చేస్తారు. దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో జాప్యాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కార్పొరేషన్ హెచ్చరించింది.
{{/usCountry}}ఆస్తి పన్ను ఎగవేతదారులకు వన్-టైమ్ సెటిల్మెంట్ పథకం కూడా అమలులో ఉంది. దీని కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీపై 90 శాతం మినహాయింపు అందిస్తారు.