హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్ రానుంది. కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద గ్రేటర్ హైదరాబాద్కు త్వరలోనే 2,000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నడపనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టెండర్లకు సంబంధించి కీలక దశ పూర్తయింది.

దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మెుత్తం 10,900 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లను ఆహ్వానించారు. కేంద్రం తెరిచిన ఆర్థిక బిడ్లలో తెలంగాణ నుంచి మేఘా, గ్రీన్సెల్ మెుబిలిటీ సంస్థలు అర్హత సాధించాయి. మేఘాకు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాట్ 1లో 1,085 బస్సులు పొందడానికి అర్హత సాధించింది. గ్రీన్సెల్ మొబిలిటీ లాట్-2లో 915 బస్సులకు అర్హత పొందింది. ఈ 2 వేల బస్సులు దశలవారీగా హైదరాబాద్లో అందుబాటులోకి రానున్నాయి.
ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) అనుబంధ సంస్థ, కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ ఏజెన్సీ అయిన CESL, ఐదు ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం, జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నంలో భాగంగా డీజిల్ బస్సులను మార్చే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తోంది.
PM E-DRIVE కింద, 14,028 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు అయ్యాయి. వీటిలో ఫేజ్-Iలో 10,900 ఉన్నాయి. ఈ టెండర్ హైదరాబాద్తో సహా ప్రధాన నగరాలు, రాష్ట్ర రవాణా సంస్థలను కవర్ చేస్తుంది. 10,000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం టెండర్లు ఖరారు చేసినప్పుడు దాదాపు నాలుగు మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని సీఈఎస్ఎల్ అంచనా వేసింది. ఈ మెగా టెండర్ PM E-DRIVE (ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) పథకంలో భాగం.
దశ-I టెండర్లు 10,900 ఎలక్ట్రిక్ బస్సులను కవర్ చేశాయి. నవంబర్ 14న టెక్నికల్ బిడ్లు తెరిచారు. 16 మంది బిడ్డర్లు పాల్గొన్నారు, డిసెంబర్ 23న ధర బిడ్లను ఖరారు చేశారు. కేటాయింపులో హైదరాబాద్కు 2,000 ఈ-బస్సులు ఉన్నాయి.
{{/usCountry}}దశ-I టెండర్లు 10,900 ఎలక్ట్రిక్ బస్సులను కవర్ చేశాయి. నవంబర్ 14న టెక్నికల్ బిడ్లు తెరిచారు. 16 మంది బిడ్డర్లు పాల్గొన్నారు, డిసెంబర్ 23న ధర బిడ్లను ఖరారు చేశారు. కేటాయింపులో హైదరాబాద్కు 2,000 ఈ-బస్సులు ఉన్నాయి.
{{/usCountry}}