UPSC Free Coaching : తెలంగాణలో ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్.. దరఖాస్తులు మే 7న ప్రారంభం!

UPSC Free Coaching : తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఉచిత కోచింగ్ పథకం అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన దరఖాస్తులు మే 7వ తేదీన ప్రారంభం అవుతాయి.

Published on: May 5, 2026, 19:32:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ మతాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ఉచిత శిక్షణను అందిస్తోంది. ఆర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఖరీదైన ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక తమ కలను వదులుకోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్
ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్

తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ మరియు కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ (TGMSC&CCC), UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) 2027 కోసం మైనారిటీ వర్గ విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ కేంద్రం, డిజిటలైజ్డ్ తరగతి గది, గ్రంథాలయం, ఇంటర్నెట్, వై-ఫై కనెక్టివిటీ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, వసతి వంటి సౌకర్యాలను అందిస్తుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులను మే 7వ తేదీ నుండి స్వీకరించడం ప్రారంభిస్తారు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మే 31గా నిర్ణయించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో జూన్ 14న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి సాధారణ, వృత్తిపరమైన డిగ్రీ నేపథ్యాలు కలిగిన ముస్లిం, క్రైస్తవ , సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ వంటి మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశం మెరిట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తుదారు తల్లిదండ్రులు లేదా సంరక్షకుని వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ. 5 లక్షలకు మించకూడదు.

అందుబాటులో ఉన్న సీట్లలో 33.33 శాతం మహిళా అభ్యర్థులకు, 5 శాతం దివ్యాంగులకు రిజర్వ్ ఉంటాయి.

కోచింగ్ ప్రయోజనాలు

ఎంపికైన విద్యార్థులకు హైదరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సబ్జెక్టు నిపుణులతో తరగతులు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అవసరమైన ప్రామాణిక పుస్తకాలు, నోట్స్ ఉచితంగా అందిస్తారు. వసతి సౌకర్యం ఉంటుంది. 24/7 అందుబాటులో ఉండే లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం కల్పిస్తారు.

దరఖాస్తు ఎలా చేయాలి?

ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://cet.cgg.gov.in/tmreis లో ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. విద్యా ధృవీకరణ పత్రాలు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని మైనారిటీ యువత సద్వినియోగం చేసుకొని, దేశ సేవలో భాగస్వాములు కావాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More