Rohit Reddy : మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కాల్పుల మోత- డ్రగ్స్ సీజ్!
Pilot rohit reddy : తెలంగాణ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హోస్లో కాల్పుల కలకలం రేగింది. ఘటనాస్థలం నుంచి డ్రగ్స్ని సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా డ్రగ్స్ టెస్ట్లో రోహిత్ రెడ్డికి నెగిటివ్ వచ్చినట్టు స్పష్టం చేశారు.
తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి వేళ కాల్పుల మోత మోగింది. ఈ ఫామ్ హౌస్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినది అని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ ఫామ్ హౌస్ మోయినాబాద్ అజీజ్నగర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మద్యం, డ్రగ్స్ పార్టీ నడుస్తోందని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఫామ్ హైస్పై స్థానిక పోలీసులతో పాటు ఈగల్ టీమ్, ఎస్ఓటీ దాడులు చేశారు. పోలీసులను చూసిన వెంటనే భయంతో చాలా మంది ఉలిక్కిపడ్డారు. వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డారు.
ఈ పార్టీలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారిలో కొందరి పేర్లను పోలీసులు వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏలురు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, యం రమేశ్, విజయ్ కృష్ణ, కాసిక్ రవి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు ఈ ఫామ్ హౌస్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు ఒక మహిళ కూడా ఉన్నట్టు వివరించారు.
ఈ పార్టీపై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి 2 గ్రాముల వైట్ పౌడర్ను అధికారులు సీజ్ చేశారు. పరీక్షల్లో అది డ్రగ్సే అని తేలింది.
కాగా పార్టీలో చిక్కిన వారికి పోలీసులు డ్రగ్స్ కిట్తో టెస్టింగ్ నిర్వహించారు. రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమీద్ మిశ్రా, కాసిక్ రవితో పాటు అర్జున్ రెడ్డికి ఈ టెస్టింగ్లో పాజిటివ్గా వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తదుపరి నిర్థరణ కోసం శాంపిల్స్ని హాస్పిటల్కి పంపించినట్టు వివరించారు.
అయితే ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకోలేదని పట్టుబడ్డ కొందరు చెబుతున్నారు. గత వారం సిమ్లా, గోవాలో డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులకు చెప్పారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్టు, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చేవేళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












