హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, కిస్మత్ పూర్తో పాటు ఔటర్ రింగు రోడ్డులోని కొన్ని ప్రాంతాలు పొగమంచుతో కప్పినట్లుగా మారాయి. దీంతో హైదరాబాద్ - శంషాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణికులు వాహనాలను రహదారి పక్కన నిలిపివేశారు. సుమారు 10 కిలోమీటర్ల వరకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు మాత్రం చాలా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితులు ఉన్నాయి.
మరోవైపు హైదరాబాద్ - విజయవాడ హైవేపై కూడా ఇదే మాదిరి పరిస్థితులున్నాయి. పొగమంచు కారణంగా వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అబ్దుల్లాపూర్మెట్ - ఘట్కేసర్ బైపాస్ మార్గంలోనూ దట్టమైన పొగమంచు అలుముకుంది.
ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి రన్వేపై విజిబిలిటీ ఏకంగా జీరోకి పడిపోవడంతో పలు విమానలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ కు రావాల్సిన పలు విమానాలు కూడా ఆలస్యంగా నడవనున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్ర రిపోర్ట్ ప్రకారం.... ఆకాశం పాక్షికంగా మేఘావృతమైన ఉంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులుంటాయి. ఉపరితల గాలులు తూర్పు, ఆగ్నేయ దిశలో గంటకు 4 నుంచి 6 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన ప్రయాణాలను రద్దు చేసుకోవాలని పేర్కొంటున్నారు. పొగమంచు పరిస్థితులు తక్కువగా ఉంటేనే ప్రయాణాలు చేసుకోవాలని చెబుతున్నారు.
{{/usCountry}}పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన ప్రయాణాలను రద్దు చేసుకోవాలని పేర్కొంటున్నారు. పొగమంచు పరిస్థితులు తక్కువగా ఉంటేనే ప్రయాణాలు చేసుకోవాలని చెబుతున్నారు.
{{/usCountry}}