కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. మహాలక్ష్మి పథకం పేరుతో అమలు చేస్తున్న ఈ పథకానికి భారీగా స్పందన ఉంది. డిసెంబర్ 20, 2023న ప్రారంభించిన ఈ పథకం తెలంగాణలోని ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులలో మహిళలు, బాలికలు, లింగమార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది

ఈ పథకం ద్వారా మహిళలు పెద్ద మెుత్తం డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 10, 2026 నాటికి 273.24 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. దీనిద్వారా మహిళలకు రూ.9,360.06 కోట్లు ఆదా అయింది. ఈ పథకం టీజీఎస్ఆర్టీసీ బస్సులలో 81 శాతం అమలులో ఉంది. ప్రయాణికుల సంఖ్య రోజువారీగా 33 శాతం పెరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపింది.
మరోవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే స్మార్ట్కార్డుల పంపిణీ. జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీని ఆదేశించింది.
అయితే మెుదట రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. జిల్లాకు ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే.. పరిష్కరిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్కార్డులు జారీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో సుమారు 5 లక్షల మందికి స్మార్ట్కార్డులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. చిప్తో ఈ స్మార్ట్కార్డులను తయారీ చేస్తారు. సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు.
మార్చి మధ్య నుండి పైలట్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు పిలిచారు అధికారులు. పైలట్ అమలు కోసం ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేస్తామని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.
{{/usCountry}}మార్చి మధ్య నుండి పైలట్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు పిలిచారు అధికారులు. పైలట్ అమలు కోసం ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేస్తామని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.
{{/usCountry}}ఇతర రాష్ట్రాల మహిళలు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించడం వంటి దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ఉచిత ప్రయాణ ప్రయోజనాలను క్రమబద్ధీకరించడం దీని లక్ష్యం. స్మార్ట్ కార్డులకు మారడానికి జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం, ఆధార్ను సమర్పించిన తర్వాత జీరో టిక్కెట్లు జారీ చేస్తున్నారు. స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత, అర్హత కలిగిన లబ్ధిదారులను పథకం నుండి మినహాయించకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది.