...
...
Next Story

TGSRTC : ఫ్రీ బస్‌తో ఇప్పటివరకు మహిళలకు ఎన్ని వేల కోట్లు ఆదా అయింది?

TGSRTC Free Bus : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌ను మహిళలకు వరంగా మారింది.

Updated on: Mar 5, 2026, 14:13:42 IST
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. మహాలక్ష్మి పథకం పేరుతో అమలు చేస్తున్న ఈ పథకానికి భారీగా స్పందన ఉంది. డిసెంబర్ 20, 2023న ప్రారంభించిన ఈ పథకం తెలంగాణలోని ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో మహిళలు, బాలికలు, లింగమార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది

టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ

ఈ పథకం ద్వారా మహిళలు పెద్ద మెుత్తం డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 10, 2026 నాటికి 273.24 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. దీనిద్వారా మహిళలకు రూ.9,360.06 కోట్లు ఆదా అయింది. ఈ పథకం టీజీఎస్ఆర్టీసీ బస్సులలో 81 శాతం అమలులో ఉంది. ప్రయాణికుల సంఖ్య రోజువారీగా 33 శాతం పెరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.

మరోవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే స్మార్ట్‌కార్డుల పంపిణీ. జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీని ఆదేశించింది.

అయితే మెుదట రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. జిల్లాకు ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే.. పరిష్కరిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌కార్డులు జారీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో సుమారు 5 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. చిప్‌తో ఈ స్మార్ట్‌కార్డులను తయారీ చేస్తారు. సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు.

ఇతర రాష్ట్రాల మహిళలు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించడం వంటి దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ఉచిత ప్రయాణ ప్రయోజనాలను క్రమబద్ధీకరించడం దీని లక్ష్యం. స్మార్ట్ కార్డులకు మారడానికి జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం, ఆధార్‌ను సమర్పించిన తర్వాత జీరో టిక్కెట్లు జారీ చేస్తున్నారు. స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత, అర్హత కలిగిన లబ్ధిదారులను పథకం నుండి మినహాయించకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe