మార్చి మధ్య నుంచి చిప్తో మహాలక్ష్మి స్మార్ట్కార్డులు.. పైలట్లో జిల్లాకో మండలం!
మహాలక్ష్మి పథకంలో ఉచితంగా ప్రయాణం పొందుతున్న మహిళలకు త్వరలో స్మార్ట్కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలోని లబ్ధిదారుల కోసం చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. మార్చి మధ్య నుండి పైలట్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు పిలిచారు అధికారులు. పైలట్ అమలు కోసం ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేస్తామని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తోంది. లక్షల మంది మహిళలకు ఈ పథకం వరంగా మారింది. ప్రస్తుతం మహిళలు బస్సులో వెళ్తుంటే కండక్టర్కు ఆధార్ కార్డు చూపించి.. జీరో టికెట్ తీసుకుంటున్నారు. ఈ విధానానికి ఆర్టీసీ గుడ్బై చెబుతోంది. ఇకపై స్మార్ట్ కార్డులను చూపిస్తే సరిపోతుంది.
స్మార్ట్ కార్డులకు మారడానికి జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం, ఆధార్ను సమర్పించిన తర్వాత జీరో టిక్కెట్లు జారీ చేస్తున్నారు. స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత, అర్హత కలిగిన లబ్ధిదారులను పథకం నుండి మినహాయించకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఫేక్ ఆధార్లతో ప్రయాణం చేస్తున్నారు. అలాంటివారికి ఇకపై చెక్ పడనుంది.
ఆధార్ కార్డు కారణంగా చాలాసార్లు కండక్టర్, మహిళల మద్య వాగ్వాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. ఆధార్ కార్డు మీది కాదు అని, పొటో సరిగా కనిపించక.. ఇలా అనేక సమస్యలు కొన్నిసార్లు ఎదురవుతున్నాయి. స్మార్ట్ కార్డుతో ఈ సమస్యలు అన్నీ తీరుతాయి. ఇప్పటికే మూడు కార్డుల్లో ఒక కార్డును పైన్ చేశారని తెలుస్తోంది.
మహాలక్ష్మి జీరో-టికెట్ పథకం డిసెంబర్ 9, 2023న ప్రారంభించారు. దీని ద్వారా మహిళలు తమ ఆధార్ కార్డును చూపితే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సగటున రోజుకు దాదాపు 30 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఈ పథకం కింద మహిళలు నెలకు సుమారు రూ. 6,000 ఆదా చేస్తున్నారు. జూలై 2025 నాటికి, ఈ పథకం కింద మొత్తం ప్రయాణికుల ప్రయాణాల సంఖ్య 200 కోట్లు దాటింది.

E-Paper












