ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో యూరియా ఎలా బుక్ చేయాలి? రైతన్నల కోసం కంప్లీట్ డీటెయిల్స్

యూరియా కోసం అన్నదాతలు క్యూలైన్లలో నిల్చోని పడుతున్న ఇబ్బందులను చూసి ప్రభుత్వం యాప్ విధానాన్ని తీసుకొచ్చింది. యాప్‌లో ఎక్కడి నుంచైనా యూరియాను బుక్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇక్కడ చూద్దాం..

Updated on: Dec 25, 2025, 13:28:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా యూరియాను ఈజీగా బుక్ చేయవచ్చు. ఇందుకోసం అన్నదాతలు Fertilizer Booking App ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎరువులు అందరికీ అందేలా, అక్రమాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

యాప్‌లో యూరియా ఎల్ బుక్ చేయాలి?
యాప్‌లో యూరియా ఎల్ బుక్ చేయాలి?

ఈ లింక్ క్లిక్ చేసి ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం రైతులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే ఎరువులు(ప్రస్తుతం యూరియా మాత్రమే అందిస్తారు) బుక్ చేసుకునేందుకు Fertilizer Booking Mobile Appను తీసుకొచ్చింది. యాప్‌ను ఎలా ఉపయోగించాలి అని కొందరికి అనుమానాలు ఉన్నాయి. మీ కోసం స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ ఉంది. యాప్ పేరు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్. అయితే ప్రస్తుతానికి యూరియా మాత్రమే బుక్ చేయవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ / రిజిస్ట్రేషన్ అవ్వాలి.

ఎలా లాగిన్ అవ్వాలి?

  • మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
  • ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలి.
  • పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ నమోదు చేయాలి.
  • భూమి వివరాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో చూపిస్తాయి.

నమోదు చేయాల్సిన వివరాలు

  • సాగు చేస్తున్న పంట
  • సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)
  • పంట, భూమి ఆధారంగా మీకు అర్హమైన యూరియా బ్యాగుల సంఖ్య యాప్‌లో చూపిస్తుంది.అవసరమైన బ్యాగుల సంఖ్య ఎంటర్ చేసి మీ జిల్లాలోని డీలర్ షాప్‌ను ఎంపిక చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేయాలి.

కౌలు రైతులకు ప్రత్యేక విధానం

  • కౌలు రైతు తన మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.
  • కౌలుకు తీసుకున్న భూమి పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • పట్టాదారుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ల్యాండ్ అప్రూవల్ వస్తుంది.
  • అప్రూవల్ తర్వాత యూరియా బుక్ చేయవచ్చు

ఈ వివరాలు తప్పనిసరి

పంట రకం, పంట సీజన్ (ఖరీఫ్ / రబీ), భూమి పరిమాణం (ఎకరాల్లో), పాస్‌బుక్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. పంట రకం, భూమి విస్తీర్ణం ఆధారంగానే యూరియా కేటాయింపు జరుగుతుందని గుర్తుంచుకోవాలి.

స్టాక్, డీలర్ వివరాలు

జిల్లా / మండలం / గ్రామాన్ని అన్నదాతలు ఎంపిక చేయాలి. అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలు వస్తాయి. సమీప డీలర్ షాప్‌ల జాబితా కనిపిస్తుంది. తర్వాత అవసరమైన యూరియా బ్యాగుల సంఖ్య ఎంపిక చేయాలి. బుకింగ్ పూర్తయ్యాక బుకింగ్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ సాధారణంగా 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఎలా యూరియా పొందాలి?

డీలర్ దగ్గర యూరియా పొందడానికి బుకింగ్ ఐడీతో డీలర్ షాప్‌కు వెళ్లాలి. డీలర్ స్టాక్ చెక్ చేసి యూరియా బ్యాగులు ఇస్తారు. భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియా స్పెల్స్ కేటాయింపు జరుగుతుంది.

కేటాయింపులు ఇలా

0 – 1 ఎకరం → 1 స్పెల్, 1 – 5 ఎకరాలు → 2 స్పెల్స్, 5 – 20 ఎకరాలు → 3 స్పెల్స్, 20 ఎకరాల కంటే ఎక్కువ → 4 స్పెల్స్ ఉంటాయి. ప్రతి స్పెల్ మధ్య 15 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలి.

పాస్‌బుక్ రైతుల యాప్‌లో లాగిన్ అయిన తర్వాత పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయాలి. రైతు భరోసాకు అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేస్తే భూమి వివరాలు ఓపెన్ అవుతాయి.

ఫోన్ నంబర్ మారినట్లయితే

వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)ని సంప్రదించి నంబర్ అప్‌డేట్ చేయించుకోవాలి. యూరియా బుకింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మాత్రమే అవుతుంది. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు ఇతర రైతుల ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. డీలర్ షాప్‌ల వద్ద క్యూ లైన్లు తగ్గుతాయి. కౌలు రైతులకు కూడా అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం యూరియా మాత్రమే యాప్‌లో అందుబాటులో ఉంది. డీఏపీ/ కాంప్లెక్స్ ఎరువులు ఇప్పటికీ పాత విధానంలోనే కొనుక్కోవాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More