హైదరాబాద్ మెట్రో అప్పుల రీఫైనాన్స్.. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రూ.13,527 కోట్ల రుణం.. పెరిగిన షేర్ విలువ!

హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక బలం చేకూర్చేలా కీలక ఒప్పందం జరిగింది. రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్‌ఎఫ్‌సీతో హైదరాబాద్ మెట్రో ఒప్పందం చేసుకుంది.

Published on: May 25, 2026, 16:01:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అప్పులను తీర్చడం(రీఫైనాన్స్) కోసం ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థకు.. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) రూ.13,527 కోట్ల భారీ రుణాన్ని మంజూరు చేసింది. ఈ డీల్ వార్త బయటకు రాగానే షేర్ మార్కెట్‌లో ఐఆర్‌ఎఫ్‌సీ షేర్లు 4 శాతం పెరిగి రూ.102 కి చేరుకున్నాయి.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

మెట్రో ప్రాజెక్ట్ కోసం గతంలో ఎక్కువ వడ్డీకి తీసుకున్న పాత అప్పులను తీర్చేసి.. వాటి స్థానంలో తక్కువ వడ్డీకి, ఎక్కువ కాలపరిమితితో కొత్త అప్పును తీసుకోవడాన్నే 'రీఫైనాన్సింగ్' అంటారు. ఈ రూ13,527 కోట్ల రుణాన్ని 20 ఏళ్ల పాటు ప్రతి మూడు నెలలకొకసారి ఈఎంఐ (త్రైమాసిక వాయిదాలు) రూపంలో మెట్రో సంస్థ చెల్లిస్తుంది.

ఈ అప్పు తీసుకోవడానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు గానీ, ముందే అప్పు తీర్చేస్తే వేసే పెనాల్టీలు గానీ లేవు. దీనివల్ల మెట్రో ప్రాజెక్టుపై ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది.

ప్రస్తుత మెట్రో పరిస్థితి?

హైదరాబాద్ మెట్రో ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టులో 3 కారిడార్లలో 57 స్టేషన్లతో మొత్తం 69.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్‌లో ప్రపంచంలోనే నిర్మించిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టులలో ఇది ఒకటి. ప్రస్తుతం రోజూ 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

ఈ ఆర్థిక ఊరట వల్ల తెలంగాణ ప్రభుత్వం తదుపరి మెట్రో విస్తరణ పనులను (కొత్త రూట్లు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ) మరింత వేగవంతం చేసే అవకాశం ఉంటుంది.

ఐఆర్‌ఎఫ్‌సీ సంస్థకు ఎందుకు ముఖ్యం?

సాధారణంగా IRFC సంస్థ కేవలం రైల్వే రంగానికి (రైళ్లు, పట్టాల నిర్మాణం) మాత్రమే నిధులు సమకూరుస్తుంది. కానీ ఇప్పుడు మొదటిసారిగా మెట్రో లాంటి పబ్లిక్ యుటిలిటీ (ప్రజా రవాణా) మౌలిక సదుపాయాలకు కూడా అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. తమ వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరించడంలో ఇదొక పెద్ద అడుగు అని కంపెనీ పేర్కొంది.

షేర్ మార్కెట్‌లో ఐఆర్‌ఎఫ్‌సీ పరిస్థితి?

జూలై 2024 లో ఈ షేర్ ధర అత్యధికంగా రూ.229 కి చేరింది. ఆ తర్వాత కాలంలో ఈ షేర్ భారీగా పతనమై దాదాపు 56 శాతం విలువను కోల్పోయింది. వరుసగా మూడేళ్లు లాభాలు ఇచ్చిన ఈ స్టాక్.. 2025లో 17 శాతం నష్టాన్ని మిగిల్చింది. ఈ 2026 సంవత్సరంలో కూడా ఇప్పటివరకు 20 శాతం మేర పడిపోయింది. ప్రస్తుతం జరిగిన ఈ రూ.13,527 కోట్ల మెట్రో డీల్ తర్వాత ఈ షేర్ మళ్లీ పుంజుకుంటుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More