Petrol price : తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్​, డీజిల్​ ధరలు ఎక్కువ! హైదరాబాద్​, విజయవాడలో రేట్లు ఇలా..

Petrol price hike news : దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు శుక్రవారం పెరిగాయి. కాగా ఇప్పుడు కూడా దేశంలో అత్యధిక ఇంధన ధరలు ఉన్న రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ నిలిచాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 15, 2026, 08:27:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Petrol price Hyderabad : దేశవ్యాప్తంగా పోల్చుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు, పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలను పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్​ సంస్థలు శుక్రవారం ప్రకటించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో రేట్లకు రెక్కలొచ్చాయి. ఫలితంగా సామాన్యుడి జేబుకు పడిన చిల్లు మరింత పెరిగింది! ప్రాంతాన్ని బట్టి పెట్రోల్​, డీజిల్​ ధరలు లీటరుకు కనీసం రూ. 3 చొప్పున పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో నేటి పెట్రోల్​, డీజిల్​ ధరలను ఇక్కడ తెలుసుకోండి..

పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. ( Chandrakant Paddhane)
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. ( Chandrakant Paddhane)

తెలంగాణాలో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఇలా..

హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 3.39 పెరిగి రూ. 110.89కి చేరింది. లీటరు డీజిల్​ ధర రూ. 3.26 పెరిగి రూ. 98.96గా ఉంది.

వరంగల్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 3.48 పెరిగి రూ. 110.53గాను, లీటరు డీజిల్​ ధర రూ. 3.34 పెరిగి రూ. 98.65గాను ఉన్నాయి.

నల్గొండలో లీటరు పెట్రోల్​ ధర రూ. 3.39 పెరిగి రూ. 1110.99గా ఉంది. ఇక లీటరు డీజిల్​ ధర రూ. 3.27 పెరిగి రూ. 99.08గా ఉంది.

సిద్ధిపేట్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 3.39 పెరిగి రూ. 110.88గాను, లీటరు డీజిల్​ ధర రూ. 3.26 పెరిగి రూ. 98.99గాను ఉన్నాయి.

ఇక సూర్యపేట్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 110.73 (+3.61), లీటరు డీజిల్​ ధర రూ. 98.82 (+3.46)గాను ఉన్నాయి.

యాదాద్రి భువనగిరిలో లీటరు పెట్రోల్​ ధర రూ. 2.84 పెరిగి రూ. 110.57కి చేరింది. లీటరు డీజిల్​ ధర రూ. 2.77 పెరిగి రూ. 98.70కి వెళ్లింది.

ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఇలా..

విజయవాడలో లీటరు పెట్రోల్​ ధర రూ. 113.03 (+3.29)గాను, లీటరు డీజిల్​ ధర రూ. 100.71 (+3.14)గాను ఉన్నాయి.

విశాఖపట్నంలో లీటరు పెట్రోల్​ ధర రూ. 111.74 (+3.39)గాను, లీటరు డీజిల్​ ధర రూ. 99.47 (+3.25)గాను ఉన్నాయి.

గుంటూరులో లీటరు పెట్రోల్​ ధర రూ. 3.05 పెరిగి రూ. 112.79కి వెళ్లింది. అదే సమయంలో లీటరు డీజిల్​ ధర రూ. 2.92 పెరిగి రూ. 100.49ని తాకింది.

కర్నూల్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 2.35 పెరిగి రూ. 112.96కి చేరింది. లీటరు డీజిల్​ ధర రూ. 2.27 పెరిగి రూ. 100 మార్కును హిట్​ చేసింది.

తిరుపతిలో లీటరు పెట్రోల్​, లీటర్​ డీజిల్​ ధరలు వరుసగా రూ. 112.33 (+3.29), రూ. 100.01 (+3.14)గా ఉన్నాయి.

కాకినాడలో లీటరు పెట్రోల్​ ధర రూ. 3.29 పెరిగి రూ. 113.13కి చేరింది. లీటరు డీజిల్​ ధర రూ. 3.15 పెరిగి రూ. 100.76కి వెళ్లింది.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలా..

దిల్లీ: పెట్రోల్ ధర రూ. 94.77 నుంచి రూ. 97.77 కి చేరింది. డీజిల్ రూ. 89.67 నుంచి రూ. 90.67 కి పెరిగింది.

ముంబై: పెట్రోల్ లీటరుపై రూ. 3.14 పెరిగి రూ. 106.68 కి చేరుకుంది.

కోల్‌కతా: గరిష్టంగా రూ. 3.29 పెరగడంతో పెట్రోల్ ధర రూ. 108.74 కి చేరింది.

చెన్నై: రూ. 2.83 పెంపుతో పెట్రోల్ ధర రూ. 103.67 వద్ద ఉంది.

బెంగళూరు : రూ. 3.2 పెంపుతో పెట్రోల్​ ధర రూ. 106.21గాను, రూ. 3.11 పెంపుతో లీటరు డీజిల్​ ధర రూ. 94.10గాను ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More