భాగ్యనగరంలో మెట్రో రైళ్లలో రద్దీ సమయాల్లో (పీక్ అవర్స్లో) ప్రయాణించే వారికి మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. తెలంగాణ ప్రభుత్వ ఫేజ్-1 ప్రాజెక్ట్ బదిలీ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుండటంతో మెట్రోకు రావాల్సిన 60 కొత్త కోచ్ల చేరిక కనీసం మరో రెండేళ్ల పాటు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బదిలీ ప్రక్రియతో ముడిపడిన కోచ్ల కొనుగోలు

రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా ప్రాజెక్ట్ బదిలీ అయిన వెంటనే.. బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థతో చర్చలు జరిపి అదనపు కోచ్లను ఆర్డర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో ప్రాజెక్ట్కు సంబంధించి సరికొత్త విలువ కట్టాలని (ఫ్రెష్ వాల్యుయేషన్) ఆదేశించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీనివల్ల కోచ్ల కొనుగోలుతో పాటు ఇతర కీలక నిర్ణయాలు కూడా వాయిదా పడ్డాయి.
ఈ ప్రాజెక్ట్ వాల్యుయేషన్ బాధ్యతలను, ఆర్థిక పునర్నిర్మాణ పర్యవేక్షణను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించారు. అలాగే మెట్రోకు ఉన్న పాత అప్పులను తిరిగి చెల్లించేందుకు (రీఫైనాన్స్) తగిన రుణదాతను గుర్తించాలని కూడా ఈ సంస్థను కోరారు. ఈ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని, ఈ బదిలీ ప్రక్రియ అంతా ముగిసేసరికి 2026 చివరి నాటికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆర్డర్ ఇచ్చినా రెండేళ్లు పట్టే ఛాన్స్
బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త కోచ్ల కోసం ఆర్డర్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆర్డర్ ఇచ్చినప్పటికీ, తయారీ, డెలివరీకి కనీసం 15 నెలల సమయం పడుతుందని బెంగళూరుకు చెందిన సంస్థ స్పష్టం చేసింది. దీనివల్ల కొత్త కోచ్లు మెట్రో సర్వీసుల్లో చేరడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది.
ఐటీ కారిడార్లో తీవ్ర రద్దీ
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ మార్గంలో పీక్ అవర్స్లో కోచ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని నియంత్రించాలంటే కోచ్ల సంఖ్యను పెంచడం అత్యవసరం అని అధికారులు చెబుతున్నారు.
{{/usCountry}}ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ మార్గంలో పీక్ అవర్స్లో కోచ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని నియంత్రించాలంటే కోచ్ల సంఖ్యను పెంచడం అత్యవసరం అని అధికారులు చెబుతున్నారు.
{{/usCountry}}ఈ సమస్య తీవ్రతను గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.., ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. అనంతరం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్లతో కూడా సమావేశాలు జరిగాయి. దీనిపై స్పందించిన కేంద్రం, ఫేజ్-1 వాల్యుయేషన్తో పాటు ఫేజ్-2 విస్తరణపై సమగ్ర సమీక్షను ప్రారంభించింది.