...
...
Next Story

క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో సైబర్ మోసాలు.. ఈ విషయాల్లో జాగ్రత్త!

క్రిస్మస్, న్యూఇయర్ వస్తున్నాయి. దీంతో వీటి పేరుతో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకోసం హైదరాబాద్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

Published on: Dec 18, 2025, 09:14:13 IST
Advertisement

రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ మోసగాళ్ళు పండుగ సీజన్లను ఆసరాగా చేసుకుని కొత్త పద్ధతుల ద్వారా మోసం చేస్తారని తెలిపారు. అమాయక పౌరులను మోసం చేయడానికి ఆన్‌లైన్‌ను ఉపయోగిస్తారని, ప్రజలు అదనపు అప్రమత్తంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. సైబర్ మోసగాళ్ళు బాధితులను సంప్రదించేందుకు క్రిస్మస్ లేదా నూతన సంవత్సర గిఫ్ట్స్, విదేశీ లాటరీ, క్యాష్ బ్యాక్ గెలిచారని మెసేజులు పంపిస్తారు. ప్రాసెసింగ్ ఫీజులు లేదా వ్యక్తిగత వివరాలను అడుగుతారు.

సైబర్ ఫ్రాడ్ అలర్ట్ (Unsplash)
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ (Unsplash)

మోసగాళ్ళు నూతన సంవత్సర పార్టీలు, ఈవెంట్స్, పబ్‌లు, రిసార్ట్‌లకు నకిలీ పాస్‌లను వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పేజీల ద్వారా విక్రయిస్తారు. ఆకర్షణీయమైన హాలిడే ప్యాకేజీలు, తీర్థయాత్ర యాత్రలు, క్రూయిజ్ టూర్‌లు, అంతర్జాతీయ ప్రయాణ ఒప్పందాలను చాలా తక్కువ ధరలకు ప్రచారం చేస్తారు. ముందస్తు చెల్లింపులు చేయించుకుంటారు.. తర్వాత మాయం అవుతారు. తక్కువ ధరకే అని మోసపోకూడదు.

నకిలీ హోటల్ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పేజీలతో ప్రజలను మోసం చేసి, ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలలో నూతన సంవత్సర స్టే కోసం ముందస్తు బుకింగ్ మొత్తాలను వసూలు చేస్తారు. తరువాత వారిని మీరు చేరుకోలేరు. సైబర్ మోసగాళ్ళు నకిలీ ఖాతాలు, UPI IDలను ఉపయోగించి క్రిస్మస్ ఛారిటీ, అనాథ శరణాలయాలు, చర్చిలు, సహాయ కార్యకలాపాల పేరుతో విరాళాలు కోరుతూ సందేశాలను పంపుతారని పోలీసు హెచ్చరించారు.

క్రిస్మస్ మాస్ ఎంట్రీ పాస్‌లు, కార్ పార్కింగ్ పర్మిట్లు లేదా స్పెషల్ ఈవెంట్ రిజిస్ట్రేషన్‌ల కోసం నకిలీ లింక్‌లు లేదా వాట్సాప్ సందేశాలను ప్రచారం చేస్తారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్, డెలివరీ, ప్రమోషన్ వర్క్ లేదా హోటల్ సేవలకు సంబంధించిన సీజనల్ జాబ్ ఆఫర్‌లతో పాటు, రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా డాక్యుమెంట్ వివరాలను అడుగుతారు. వీటిని చెబితే అంతేసంగతులు

అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, తెలియని యాప్‌లు, APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. OTP, PIN, CVV లేదా బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అధికారిక వెబ్‌సైట్‌లు లేదా విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే ఆఫర్‌లు, పార్టీ పాస్‌లు, బుకింగ్‌లను కన్ఫామ్ చేసుకోండి.

తెలియని క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దు లేదా తెలియని యూపీఐ అభ్యర్థనలను ఆమోదించవద్దు. మీ మొబైల్ ఫోన్ మరియు అప్లికేషన్‌లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, యువతతో సైబర్ భద్రత గురించి చర్చించండి.

ఏదైనా మోసం జరిగితే వెంటనే www.cybercrime.gov.in కు నివేదించాలని లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ - 1930 కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలను కోరారు. స్క్రీన్‌షాట్‌లు, లావాదేవీ వివరాలు, ఫోన్ నంబర్‌ల వంటి ఆధారాలను దగ్గర పెట్టుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks