...
...
Next Story

హైదరాబాద్‌లో మెుబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు 80,555

వాహనాలు నడుపుతున్నప్పుడు వాహనదారులు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడాన్ని నిరోధించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భారీగా కేసులు బుక్ చేశారు.

Published on: Oct 15, 2025, 17:51:17 IST
Advertisement

2025 జనవరి 1 నుండి అక్టోబర్ 12 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా కేసులు బుక్ చేశారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడుతున్న వారిపై 80,555 కేసులు నమోదు చేశారు. సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 2,345 కేసులు నమోదు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల దృష్టి మారుతుందని, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో ఇది ఒకటని హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) డి జోయెల్ డేవిస్ అన్నారు. ప్రాణం కంటే ఏ కాల్ ముఖ్యం కాదు అని చెప్పారు. ఈ ప్రమాదకర పద్ధతికి దూరంగా ఉండాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

'వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది.' అని జోయెల్ డేవిస్ అన్నారు.

మెుబైల్ ఫోన్ వాడుతూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి కోసం పోలీసులు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రయాణంలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడుతున్న వ్యక్తులపై మొత్తం 2345 కేసులు నమోదు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై 9010203626, 8712661690 నంబర్లకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే రూ. 5,000 జరిమానా. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే అధిక జరిమానాలు, కేసులు పెరిగే అవకాశం ఉంది. ఉల్లంఘనలను గుర్తించడానికి AI-ఆధారిత నిఘాను ఉపయోగించి, వివిధ ప్రచారాలు, కఠినమైన నిబంధనలను తీసుకొస్తున్నారు పోలీసులు. అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా లేదా పైన చెప్పిన ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్లకు పౌరులు ఫిర్యాదు చేయాలని కోరారు ట్రాఫిక్ పోలీసులు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks