హైదరాబాద్లో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. సిటీ ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సు అనుభవాన్ని గొప్పగా పునరుద్ధరించాలని హెచ్ఎండీఏ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA)కి డబుల్ డెక్కర్ బస్సుల ఆర్థిక, కార్యాచరణ భారంగా మారింది. ఫిబ్రవరి 2023లో ప్రవేశపెట్టిన ఆరు ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో నగర రోడ్లలో పెద్దగా కనిపించకపోవచ్చు.

కారణం.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(TGTDC), రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులను మోహరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏను సంప్రదించింది. అధికారుల ప్రకారం.. TGTDC ఇటీవల పర్యాటక ప్రాంతాల కోసం బస్సులను అప్పగించాలని కోరుతూ హెచ్ఎండీఏకు లేఖ రాసింది. దీనికి అథారిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని సమాచారం. చర్చలు జరుగుతున్నాయని త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
సరైన మార్కెటింగ్తో బస్సులను బడ్జెట్ ధరలో ప్రయాణ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటక అధికారులు భావిస్తున్నారు. ప్రజల స్పందన బాగుంటుందని భావిస్తున్నారు. దీనిద్వారా ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడుతుందని పర్యాటక అధికారులు విశ్వసిస్తున్నారు.
ఉదాహరణకు వరంగల్లోని రామప్ప ఆలయం, వికారాబాద్లోని అనంతగిరి కొండలు, ఇతర ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్యాకేజీ టూర్లను నిర్వహించడం ప్రతిపాదనలలో ఉన్నాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులను అక్కడకు ప్లాన్ చేస్తే.. పర్యాటకులకు కూడా కొత్త అనుభూతి కలుగుగుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం, సిటీలోని ముఖ్యమైన ప్రాంతాలకు ప్రయాణాలను అందించడం లక్ష్యంగా డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు. తక్కువ ఆక్యుపెన్సీ, పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా ఇబ్బందికరంగా మారింది. ఆరు బస్సులకు నెలవారీ కార్యకలాపాల ఖర్చులు ఎక్కువే అవుతున్నట్టుగా సమాచారం.
ఒకప్పుడు భాగ్యనగరంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ తీసుకురావాలనే సంకల్పంతో అధికారులు చాలా కృషి చేసి వీటిని సిటీలోకి ప్రవేశపెట్టారు. హెచ్ఎండీఏ ఆరు బస్సులను ఒక్కొక్కటి రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం రూ. 12 కోట్లు పెట్టుబడి పెట్టింది. అయితే అనుకున్నంతగా జనాలు ఈ బస్సులవైపు ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం అవి నెక్లెస్ రోడ్–హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్–గోల్కొండ వంటి పర్యాటక రూట్లలో నడుస్తున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన పర్యాటక ప్రాంతాలకు ఈ డబుల్ డెక్కర్ బస్సుల ద్వారా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీలు అందించాలని అధికారులు చర్చిస్తున్నారు.
{{/usCountry}}ఒకప్పుడు భాగ్యనగరంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ తీసుకురావాలనే సంకల్పంతో అధికారులు చాలా కృషి చేసి వీటిని సిటీలోకి ప్రవేశపెట్టారు. హెచ్ఎండీఏ ఆరు బస్సులను ఒక్కొక్కటి రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం రూ. 12 కోట్లు పెట్టుబడి పెట్టింది. అయితే అనుకున్నంతగా జనాలు ఈ బస్సులవైపు ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం అవి నెక్లెస్ రోడ్–హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్–గోల్కొండ వంటి పర్యాటక రూట్లలో నడుస్తున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన పర్యాటక ప్రాంతాలకు ఈ డబుల్ డెక్కర్ బస్సుల ద్వారా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీలు అందించాలని అధికారులు చర్చిస్తున్నారు.
{{/usCountry}}