HYDRAA : ఆక్రమణలపై భారీ ఆపరేషన్ - రూ. 1650 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..!

హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో 11 ఎక‌రాల‌ను కాపాడింది. రూ. 1650 కోట్ల విలువైన భూమి చుటూ ఫెన్సింగ్ వేసింది.

Published on: Mar 17, 2026, 16:32:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ న‌గ‌రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1650 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇందులో 2 ఎక‌రాలు పార్కు కోసం కేటాయించిన‌ది కాగా.., 5 ఎక‌రాలు స్మ‌శాన వాటిక‌తో పాటు 4 ఎక‌రాల డంప్ యార్దుకు చెందిన‌ది ఉంది.

11 ఎక‌రాల‌ భూమిని కాపాడిన హైడ్రా
11 ఎక‌రాల‌ భూమిని కాపాడిన హైడ్రా

హైడ్రా విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం….. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ విలేజ్లోని సెంట్ర‌ల్ పార్కు కాల‌నీలో పార్కు కోసం 2 ఎక‌రాలు కేటాయించారు. స‌ర్వే నంబ‌రు 110/1 లో 148 ప్లాట్ల‌తో 16 ఎక‌రాల మేర సెంట్ర‌ల్ పార్కు కాల‌నీ ఫేజ్‌-1 పేరుతో 1998లో లే ఔట్ వేశారు. ఇందులో 2 ఎక‌రాల‌ను పార్కు కోసం కేటాయించ‌గా.. మున్సిప‌ల్ అధికారులు పార్కు స్థ‌లంగా హ‌ద్దులు నిర్ధారించి ప్ర‌హ‌రీ కూడా నిర్మించారు. ఇలా పార్కు కోసం కేటాయించిన భూమి త‌మ‌దంటూ కొంత‌మంది ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ‌డం.. కాల‌నీవాళ్లు అడ్డుకుంటే వారిని బెదిరించ‌డం వంటి ఘ‌ట‌న‌లు ప‌లుమార్లు జ‌రిగాయి.

హైడ్రా ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో క‌ల‌సి హైడ్రా క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించింది. 2 ఎక‌రాల పార్కు స్థ‌లంగా నిర్ధారించింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారి ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం పార్కులో తాత్క‌లికంగా వేసిన షెడ్డుల‌ను తొల‌గించింది. 2 ఎక‌రాల పార్కు స్థ‌లం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థ‌లంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.

ప్ర‌గ‌తిన‌గ‌ర్ లో 9 ఎక‌రాలు…

ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లోని అంబీర్ చెరువుకు ఆనుకుని ఉన్న 5 ఎక‌రాల స్మ‌శాన‌వాటిక‌తో పాటు.. ఆ ప‌క్క‌నే ఉన్న 4 ఎక‌రాల డంపింగ్ యార్డు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురవుతున్నాయ‌నే ఫిర్యాదులు అందాయి. ఈ నేప‌థ్యంలో హైడ్రా క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ చేప‌ట్టింది. రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌లిసి క్షేత్ర స్థాయిలో విచారించింది. కూక‌ట్‌ప‌ల్లి మండ‌లంలోని బాగామేరి విలేజ్ స‌ర్వే నంబ‌రు 103లో ఉన్న‌ ఈ భూమిని స్మ‌శాన‌వాటిక‌కు, చెత్త డంపింగ్ యార్డుకు కేటాయించిందిగా నిర్ధారించుకున్నారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు 9 ఎక‌రాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 5 ఎక‌రాల‌లో స్మ‌శాన వాటిక స్థ‌లంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఆ ప‌క్క‌నే ఉన్న 4 ఎక‌రాల్లో ప్ర‌భుత్వ స్థ‌లంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More