పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండగ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కూడా కైట్ పెస్టివల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్ల చెరువులను సందర్శించి పలు సూచనలు చేశారు.

చెరువులలోకి నేరుగా మురుగు నీరు చేరకుండా ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు)ల ద్వారా శుద్ధి జలాలు వచ్చేలా ఏర్పాటు వెంటనే చేపట్టాలని హైడ్రా రంగనాథ్ సూచించారు. ఎస్టీపీలను ఏర్పాటుచేసిన ప్రాంతంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఇందుకు చెరువు చెంత ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించుకోవాలన్నారు. పార్కుల అభివృద్ధితో పాటు.. గ్రీనరీని పెంచాలని సూచించారు. ప్రతి చెరువును ఒక పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలన్నారు. వృద్ధులు సేదదీరే విధంగా కూర్చునే వెసులుబాటుతో పాటు.. నీడ కల్పించాలని.. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలను అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ చెప్పారు.
పతంగుల పండుగ ఆహ్లాదకర వాతావరణంలో జరిగేందుకు జీహెచ్ఎంసీ, పర్యాటకంతో పాటు.. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పని చేయాల్సినవసరాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. చెరువుల వద్ద భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. తాగు నీటి వసతితో పాటు.. మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే చెరువులను సందర్శించేందుకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు పడకుండా సులభంగా వచ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్న పార్కింగ్ సౌకర్యాన్ని కమిషనర్ పరిశీలించారు.
చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున.. అక్కడ దుమ్ము, దూళి ఎగరకుండా నీళ్లు చిలకరించాలన్నారు రంగనాథ్. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత రూపొందుతున్నందున చెరువుల్లో నీటిని నింపేందుకు ఎస్టీపీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. మూసీ నది ప్రక్షాళనను ప్రభుత్వం చేపడుతున్న వేళ.. చెరువుల మంచినీరు మూసీలో చేరేలా చూడాలన్నారు. ఇన్లెట్లు, ఔట్లెట్ల నిర్మాణంతో పాటు.. పరిసర ప్రాంతాల నుంచి వర్షపు నీరు సులభంగా చెరువులోకి చేరేలా ఛానల్స్ను అభివృద్ధి చేయాలన్నారు.
హైడ్రా పునరుద్ధరించిన అంబర్పేటలోని బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి సంబరాలకు బతుకమ్మకుంటతో పాటు.. మాధాపూర్లోని తమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా వేదికలు అవుతున్నాయి. హైడ్రా మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణలో ఉప్పల్ లోని నల్లచెరువు, మాధాపూర్లోని సున్నం చెరువు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది.
{{/usCountry}}హైడ్రా పునరుద్ధరించిన అంబర్పేటలోని బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి సంబరాలకు బతుకమ్మకుంటతో పాటు.. మాధాపూర్లోని తమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా వేదికలు అవుతున్నాయి. హైడ్రా మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణలో ఉప్పల్ లోని నల్లచెరువు, మాధాపూర్లోని సున్నం చెరువు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది.
{{/usCountry}}