...
...
Next Story

ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాను.. విచారణకు మరో డేట్ చెప్పండి : బండి భగీరథ్

Bandi Bhageerath POCSO Case : పోక్సో కేసులో బండి భగీరథ్ విచారణకు హాజరు కాలేదు. అయితే పోలీసులకు మెయిల్‌లో ఎందుకు హాజరుకాలేదో వివరించాడు.

Published on: May 13, 2026 07:59 PM IST
Advertisement

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్, బుధవారం జరగాల్సిన పోలీసు విచారణకు గైర్హాజరయ్యాడు. తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా అధికారుల ముందుకు రాలేకపోతున్నానని పేర్కొంటూ పేట్‌ బషీరాబాద్ పోలీసులకు ఒక ఈ-మెయిల్ పంపాడు.

మెయిల్‌లో ఏముంది?

బండి భగీరథ్ పోక్సో కేసు
బండి భగీరథ్ పోక్సో కేసు

పోలీసు నోటీసులకు స్పందిస్తూ భగీరథ్ తన మెయిల్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సేకరించాల్సి ఉందని, అందుకోసం తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరాడు. దర్యాప్తునకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సంబంధిత అధికారుల ఎదుట తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం హాజరు కాలేనని, విచారణ కోసం మరొక తేదీని చెప్పాలని విజ్ఞప్తి చేశాడు..

భగీరథ్ గడువు కోరడంపై పోలీసులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కఠినమైన పోక్సో సెక్షన్లు నమోదు చేశారు దర్యాప్తు అధికారులు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ 5(l) రెడ్‌విత్ 6ను కూడా అదనంగా చేర్చారు. దీనివల్ల కేసు తీవ్రత మరింత పెరిగింది. ఇక తాజాగా భగీరథ్ విన్నపాన్ని మన్నిస్తారా లేదా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారా అన్నది వేచి చూడాలి.

మరోవైపు ఈ కేసులో అరెస్టు భయంతో భగీరథ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను కొట్టివేయాలని, లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ మే 14న (గురువారం) వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, సమగ్ర విచారణ కోసం కుకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బండి భగీరథ్ పోక్సో కేసు మీద చర్చ ఎక్కువగా నడుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe