మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్మీడియట్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం విద్యార్దులు దరఖాస్తు చేసుకోవాలనీ హైదారాబాద్ ఉమ్మడి జిల్లాల బీసీ గురుకులo పాఠశాలలు, కళాశాలల రీజినల్ కో ఆర్డినేటర్ గౌతం కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 12వ తేదీలోగా మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

హైదారాబాద్ జిల్లాలో 14 బాలుర, 14 బాలికల కళాశాలలు(ఇంగ్లీష్ మీడియం) ఉన్నాయని, ఎంపీసీ, బైపిసి, సీఈసీ, హెచ్ఈసీ, ఈ సంవత్సరం ఏసీఈ కొత్త గ్రూప్ అందుబాటులో ఉన్నాయని గౌతం తెలిపారు. వృత్తి విద్యా కోర్సులో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కూడా ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో బీసీ గురుకులం కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సొసైటీ పరిధిలో 290 కళాశాలల్లో 24,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. MPC, BPC, CEC, కొన్ని వృత్తి విద్యా కోర్సులు(Vocational Courses) అందుబాటులో ఉంటాయి.
- బాలుర కళాశాలలు : 12,640+ సీట్లు
- బాలికల కళాశాలలు : 12,000+ సీట్లు
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
- పదవ తరగతి హాల్ టికెట్ నంబర్.
- కులం ధృవీకరణ పత్రం (Caste Certificate).
- ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate).
- ఆధార్ కార్డు వివరాలు.
ముఖ్య గమనిక
ఇప్పటికే బీసీ గురుకుల పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారికి నేరుగా 'ఇన్ హౌస్' కోటా కింద సీట్లు కేటాయిస్తారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లకు అర్జీ ఇస్తే సరిపోతుంది. ప్రైవేట్ లేదా ఇతర ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మార్కులు, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
{{/usCountry}}ఇప్పటికే బీసీ గురుకుల పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారికి నేరుగా 'ఇన్ హౌస్' కోటా కింద సీట్లు కేటాయిస్తారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లకు అర్జీ ఇస్తే సరిపోతుంది. ప్రైవేట్ లేదా ఇతర ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మార్కులు, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
{{/usCountry}}ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు 040-23328266 నెంబర్లో సంప్రదించాలి.
https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjptbcadmissions.org/MJP-Inter లో అప్లై చేసుకోవచ్చు.