షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
ఈనెలలోనే జర్నీ…

ఈ టూర్ ప్యాకేజీని “సాయి సన్నిధి EX హైదరాబాద్ ”పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఆగస్ట్ 19 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- మొదటి రోజు (బుధవారం) : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 06:30 గంటలకు అజంతా ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 17064) బయలుదేరుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
- రెండవ రోజు (గురువారం) : ఉదయం 07:10 గంటలకు మహారాష్ట్రలోని నగర్సోల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన ఏసీ వాహనంలో షిర్డీలోని హోటల్కు తీసుకెళ్తారు. హోటల్లో చెక్-ఇన్ అయిన తర్వాత భక్తులు తమ సొంత ఖర్చులతో/ఏర్పాట్లతో షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 5:00 గంటలకు హోటల్ నుంచి చెక్-అవుట్ చేసి తిరిగి నాగర్సోల్ స్టేషన్కు చేరుకుంటారు. రాత్రి 09:20 గంటలకు బయలుదేరే ట్రైన్ నంబర్ 17063 ద్వారా తిరుగు ప్రయాణమవుతారు.
- మూడవ రోజు (శుక్రవారం) : ఉదయం 09:45 గంటలకు కాచిగూడ స్టేషన్కు చేరుకోవడంతో ఈ పవిత్ర యాత్ర పూర్తవుతుంది.
టూర్ ప్యాకేజీ ధరలు :
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ.7920గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6700,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6690గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5100, డబుల్ షేరింగ్ కు రూ. 5100, సింగిల్ షేరింగ్ కు రూ. 6370గా నిర్ణయించారు.
{{/usCountry}}ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ.7920గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6700,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6690గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5100, డబుల్ షేరింగ్ కు రూ. 5100, సింగిల్ షేరింగ్ కు రూ. 6370గా నిర్ణయించారు.
{{/usCountry}}ప్రయాణానికి 15 రోజుల కంటే ముందే రద్దు చేసుకుంటే ప్రయాణికుడికి రూ. 250 మినహాయించుకుంటారు.4 నుండి 7 రోజుల ముందు రద్దు చేస్తే 50 శాతం రుసుము మినహాయిస్తారు.ప్రయాణానికి 4 రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ లభించదు.
బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ irctctourism.com ని సందర్శించవచ్చు లేదా సికింద్రాబాద్లోని ఐఆర్సీటీసీ కార్యాలయం (ఫోన్: 040-27702407, 9701360701) ను సంప్రదించవచ్చు.