IRCTC Shirdi Tour Package : హైదరాబాద్ టు షిర్డీ ట్రిప్ - తగ్గిన టూర్ ప్యాకేజీ ధరలు..! ఇవిగో వివరాలు
IRCTC Hyderabad Shirdi Tour Package : హైదరాబాద్ నుంచి షిర్డీకి IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మార్చి 4వ తేదీన జర్నీ ఉంటుంది. 3 రోజుల పాటు టూర్ ఉంటుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీని “సాయి సన్నిధి EX హైదరాబాద్ ”పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ మార్చి 4వ తేదీన అందుబాటులో ఉంది.
2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఆసక్తి గల టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.
షిర్డీ టూర్ షెడ్యూల్ వివరాలు:
- మొదటి రోజు 1 : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.40 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ - 17064, అజంతా ఎక్స్ ప్రెస్) ఉంటుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో 2 : ఉదయం 7.10 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుంది. ఆ తర్వాత షిర్డీకి వెళ్లాలి. హోటల్ వెళ్లిన తర్వాత.. షిర్డీ సాయిబాబు ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 05 గంటలకు రూమ్ చెక్ ఔట్ చేయాలి. రాత్రి 08. 30 గంటల వరకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
- మూడో 3 :మూడో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ - షిర్డీ ట్రిప్ - తగ్గిన ధరలు
జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం…సింగిల్ షేరింగ్ కు రూ.7890గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6660,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6640గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4960, డబుల్ షేరింగ్ కు రూ. 4980, సింగిల్ షేరింగ్ కు రూ. 6220గా నిర్ణయించారు.
గతేడాది డిసెంబర్ నాటితో పోల్చితే ప్రస్తుతం ఈ ప్యాకేజీ ధరలు తగ్గాయి. అప్పుడు సింగిల్ షేరింగ్ కు రూ.8790, డబుల్ షేరింగ్ కు రూ. 7110,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6940గా ఉండేది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం చూస్తే… కొంతమేర ధరలు తగ్గాయి.
ఇక ఈ ప్యాకేజీలో టూర్ టికెట్లు, లంచ్, డిన్నర్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరే భరించుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

