తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మెుదలైంది. అయితే యాంటీ డ్రగ్ అఫిడవిట్ కచ్చితంగా ఇవ్వాలని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఇంటర్ బోర్డు మరో ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో ప్రభుత్వం రెండు నిబంధనలను చాలా సీరియస్గా అమలు చేస్తోందని, ఆధార్ కార్డు, యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు పేర్కొందని వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అడ్మిషన్ సమయంలో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులు కూడా మేం మత్తు పదార్థాలను వినియోగించబోం, విక్రయించబోం అని రాసి ఉన్న అఫిడవిట్పై సంతకం చేసి కళాశాలకు సమర్పించాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా మరోసారి ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది.
మత్తుపదార్థాల నిరోధక చర్యలకు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను నోటరైజ్డ్ అఫిడవిట్లను సమర్పించమని బలవంతం చేస్తున్నారని పేర్కొంటూ వచ్చిన కొన్ని నివేదికలు, సమాచారాల విషయం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (టీజీబీఐఈ) దృష్టికి వచ్చింది.
ఈ విషయంలో విద్యార్థులలో మత్తుపదార్థాల దుర్వినియోగంపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకునేలా చూడటం అనే లక్ష్యంతో కొత్త విధానాన్ని ఇంటర్ బోర్డు అమల్లోకి తెచ్చింది. ప్రవేశాల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి ఒక సాధారణ యాంటీ డ్రగ్ డిక్లరేషన్ను పొందాలని మాత్రమే బోర్డు అన్ని జూనియర్ కళాశాలలకు సూచించిందని స్పష్టం చేసింది.
ఈ ప్రకటనను ఎట్టి పరిస్థితుల్లోనూ నోటరైజ్డ్ అఫిడవిట్గా పరిగణించరాదని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ప్రకటనను సమర్పించడం కోసం ఏ విద్యార్థి గానీ, తల్లిదండ్రులు గానీ నోటరీని సంప్రదించాల్సిన అవసరం లేదు లేదా ఎలాంటి ఖర్చు భరించాల్సిన అవసరం లేదు.
TGBIE-ACAD/ADMN/1/2024-ACAD, తేదీ 12.05.2026 ద్వారా జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరికీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులకు ఈ వివరణ ఇప్పటికే తెలియజేశారు. సులభంగా యాక్సెస్ చేయడానికి, అమలు చేయడానికి డిక్లరేషన్ ఫారమ్లు TGBIE అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రిన్సిపాల్స్ అందరూ పై వివరణను కచ్చితంగా పాటించాలని, అడ్మిషన్ ప్రక్రియ సమయంలో విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది.
{{/usCountry}}ప్రిన్సిపాల్స్ అందరూ పై వివరణను కచ్చితంగా పాటించాలని, అడ్మిషన్ ప్రక్రియ సమయంలో విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది.
{{/usCountry}}