...
...
Next Story

LPG Supply : తెలంగాణలో పెట్రోల్, ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉందా? లేదా?

LPG Supply : తెలంగాణలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరతపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి రాష్ట్రంలో వీటి కొరత ఉందా?

Published on: Apr 14, 2026, 10:25:10 IST
Advertisement

పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గిందని, ప్రస్తుతం యుద్ధానికి ముందు స్థాయికి చేరుకుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) తెలిపాయి. భయాందోళనలతో వినియోగదారులు చేసే బుకింగ్‌లు గణనీయంగా తగ్గడంతో ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్‌లు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు సుమారు 2.18 లక్షల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. యుద్ధానికి ముందు రోజుకు సగటున 2.15 లక్షల సిలిండర్లు సరఫరా అయ్యేవని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడానికి ఇది సరిపోతుందని కూడా ప్రకటించాయి.

ఎల్పీజీ సరఫరా
ఎల్పీజీ సరఫరా

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ ప్రకారం.. సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. లాజిస్టిక్స్‌ను క్రమబద్ధీకరించడానికి, డెలివరీలను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. కార్యాచరణ సమస్యలను పరిష్కరించడానికి, పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సరఫరా సజావుగా, నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ఓఎంసీలు రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు(పీఎన్‌జీ)ని సౌకర్యవంతమైన, సురక్షితమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయ వంట ఇంధనంగా ప్రోత్సహిస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, చౌటుప్పల్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, షాద్‌నగర్, రామగుండం, ఇంకా పలు ఇతర పట్టణాల్లో పీఎన్జీ సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు పీఎన్జీ కనెక్టివిటీని విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు పౌర సరఫరాల కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి సమన్వయంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, హోటల్ సంఘాల ప్రతినిధులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. డిపోల నుండి వాణిజ్య ఎల్‌పీజీ మొత్తం సరఫరా, పంపిణీపై అధికారులు చర్చించారు. కొన్ని రంగాలలో సరఫరాలో జాప్యం జరుగుతుందని గమనించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe