జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : 'హస్తం' పార్టీకి 50 శాతం ఓట్లు - మెజార్టీలోనూ సరికొత్త రికార్డు..! ఇవిగో వివరాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే పార్టీల వారీగా సాధించిన ఓట్ల శాతం వివరాలను ఇక్కడ చూడండి….
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన ప్రకారం…. కాంగ్రెస్కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్కు 74,259 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీకి 17,061 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.
పోలింగ్ శాతం వివరాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 50.83 శాతం ఓట్లు రాగా… బీఆర్ఎస్ కు 38.13 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇక బీజేపీకి కేవలం 8.76 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ఖి మాగంటి గోపినాథ్ 16,337 ఓట్ల తేడాతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజహరుద్దీన్ కు 64,212 ఓట్లురాగా.. బీజేపీ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చాయి.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 35.03 శాతం ఓట్లు రాగా… ఈసారి జరిగిన ఉపఎన్నికలో మాత్రం 50.83 శాతం ఓట్లు దక్కాయి. ఈ విక్టరీతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకున్నట్లు అయింది. ఇక బీఆర్ఎస్ కు చూస్తే 2023 ఎన్నికలో 43.94 శాతం ఓట్లు రాగా.. ఈసారి తగ్గింది. బీజేపీకి 14.11 శాతం ఓట్లు వస్తే… ఈసారి జరిగిన ఉప ఎన్నికలో కేవలం 8.76 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో నవీన్ యాదవ్ కు దక్కిన మెజార్టీనే ఎక్కువ. గతంలో మాగంటి, విష్ణువర్థన్ రెడ్డికి వచ్చిన మెజార్టీలు పైస్థానంలో ఉండగా… వాటన్నింటిని దాటి నవీన్ యాదవ్ ఏకంగా 24,729 ఓట్లు తేడాతో గెలిచి రికార్డు సృష్టించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

