వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్నగర్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కాకతీయ కాలం నాటి 800 ఏళ్ల పురాతన శివాలయాన్ని మంగళవారం అధికారులు కూల్చివేశారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ పురాతన రాతి కట్టడాన్ని, భూమిని చదును చేయడానికి బుల్డోజర్లను ఉపయోగించి నేలమట్టం చేశారు.

ఈ పురాతన ఆలయం కూల్చివేత తీవ్ర నిరసనలకు దారితీసింది. కాంట్రాక్టర్ ఏకపక్షంగా ఆలయాన్ని నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న కట్టడాలకు సంబంధించిన నిబంధనలను పక్కనపెట్టి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మద్దతుతో ఈ చర్య చేపట్టారని స్థానికులు ఆరోపించారు.
వారసత్వ ప్రదేశాన్ని ధ్వంసం చేసే ముందు పురావస్తు, దేవాదాయ శాఖల నుండి అవసరమైన అనుమతులు పొందారా లేదా అనే విషయంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం (కేటీసీబీ) ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది చారిత్రక సంపదను నాశనం చేయడమేనని పేర్కొంది.
కేటీసీబీ కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఈ చర్యపై తీవ్రంగా మండిపడ్డారు. 13వ శతాబ్దపు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి బదులుగా పాఠశాల ప్రాంగణంలో సులభంగా విలీనం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. అటువంటి చారిత్రాక ఆలయాన్ని నిర్మించడానికి సంవత్సరాల తరబడి శిల్పకళ అవసరమని, కానీ దానిని ఒక్క రోజులోనే శిథిలావస్థకు చేర్చారని ఆరోపించారు.
చరిత్ర ప్రియులు, స్థానికులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణ వివరణను డిమాండ్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఆ ప్రాంతంలోని వారసత్వ సంపద విధ్వంసాన్ని ఆపాలని, అలాగే అనధికారిక కూల్చివేతలకు బాధ్యులైన వారిని జవాబుదారీగా చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఏం జరిగింది అంటే?
కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేసింది. దీని నిర్మాణం కోసం అశోక్నగర్లోని శివాలయానికి సంబంధించిన 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. గత నెల రోజులుగా కాంట్రాక్టర్ ఈ స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో శివాలయం చుట్టూ ఉన్న చారిత్రక మట్టికోటను పాక్షికంగా తొలగించారు.
{{/usCountry}}కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేసింది. దీని నిర్మాణం కోసం అశోక్నగర్లోని శివాలయానికి సంబంధించిన 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. గత నెల రోజులుగా కాంట్రాక్టర్ ఈ స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో శివాలయం చుట్టూ ఉన్న చారిత్రక మట్టికోటను పాక్షికంగా తొలగించారు.
{{/usCountry}}ఆలయాన్ని కాపాడాలని గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ, సోమవారం నాడు శిథిలావస్థలో ఉన్న ఆ పురాతన దేవాలయాన్ని కాంట్రాక్టర్ పూర్తిగా కూల్చివేశారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై తహసీల్దార్ రమేశ్ స్పందిస్తూ.. కేవలం కోటలోని మొక్కలను మాత్రమే తొలగించారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పనులను నిలిపివేసినట్లు వెల్లడించారు.