BRS Membership Drive 2026 : పార్టీ యంత్రాంగాన్ని ఆధునీకరించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) సిద్ధమైంది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం అత్యంత కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ భేటీలో పార్టీ భవిష్యత్తు… సభ్యత్వ నమోదు ప్రక్రియపై స్పష్టమైన రోడ్ మ్యాప్ను కేసీఆర్ ఖరారు చేశారు.
డిజిటల్ బాటలో గులాబీ దళం

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ వంటి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కూడా ఇకపై పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి ఒక సభ్యత్వ సమన్వయకర్తను నియమిస్తారు. రాబోయే రెండు మూడు రోజుల్లోనే మండలాలు, మున్సిపల్ బాడీల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది.
71,310 మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ
డిజిటల్ సభ్యత్వ నమోదు కేవలం పేరుకే కాకుండా, పక్కాగా సాగేలా చూడాలని కేసీఆర్ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్లలో బూత్కు ఇద్దరు చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలను ఎంపిక చేసి,,,, వారికి డిజిటల్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా శిబిరాల పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శులకు అప్పగించారు.
జిల్లాల వారీగా ఇంచార్జీల నియామకం
సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా సాగేలా చూడటానికి సీనియర్ నేతలకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు.
- ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు - తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
- జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి.
- ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి.
- జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి.
- మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు - గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి.
- నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు - గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
- మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు - నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు - రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి.
- వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు - సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.
- మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రి.
- గద్వాల్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలు — మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి.
- మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్.
- హైదరాబాద్ జిల్లా — తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.
- నల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి.
ఈ నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఉత్తేజితం చేసి, సభ్యత్వ నమోదులో కొత్త రికార్డులు సృష్టించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అధునాతన సాంకేతికతను వాడుకుంటూనే…. ప్రతి గడపకు పార్టీని తీసుకెళ్లేలా ఈ వ్యూహాన్ని రూపొందించారు.
{{/usCountry}}ఈ నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఉత్తేజితం చేసి, సభ్యత్వ నమోదులో కొత్త రికార్డులు సృష్టించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అధునాతన సాంకేతికతను వాడుకుంటూనే…. ప్రతి గడపకు పార్టీని తీసుకెళ్లేలా ఈ వ్యూహాన్ని రూపొందించారు.
{{/usCountry}}