తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను కేసీఆర్ చూసుకుంటారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోమాజిగూడలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ.. తెలంగాణకు కేసీఆరే ఓజీ(Original Gangster) అని అభివర్ణించారు.

తెలంగాణలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, గతంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్షా కాదని.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి, త్యాగాలు చేసి, రక్తం చిందించిన ఇక్కడి ప్రజలదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 'తెలంగాణ అనేది ఇక్కడి నాలుగు కోట్ల ప్రజల భూమి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారిది.' అని ఆయన అన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థిరపడిన వారెవరూ ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని చెప్తూ.. ఏ ప్రాంతానికి చెందిన వారైనా తెలంగాణలో నివసించవచ్చని, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవచ్చని, అందరికీ ఇక్కడ స్వాగతం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రాంతీయతత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను తప్పుపట్టిన కేటీఆర్.. భారతదేశ చరిత్రలో ప్రాంతీయ ఆకాంక్షలు ఎప్పుడూ కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. నాడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం స్వాతంత్య్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదాహరణగా పేర్కొన్నారు.
తెలంగాణ నుండి పరిశ్రమలను గుజరాత్కు తరలిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. దీనిని 'ఆర్థిక ప్రాంతీయతత్వం' కాదా? అని ప్రశ్నించారు. శతాబ్దాల తరబడి సాగిన పోరాటాలు, త్యాగాలు, ప్రతిఘటనల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలకు ఎవరూ దేశభక్తి గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు.
{{/usCountry}}తెలంగాణ నుండి పరిశ్రమలను గుజరాత్కు తరలిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. దీనిని 'ఆర్థిక ప్రాంతీయతత్వం' కాదా? అని ప్రశ్నించారు. శతాబ్దాల తరబడి సాగిన పోరాటాలు, త్యాగాలు, ప్రతిఘటనల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలకు ఎవరూ దేశభక్తి గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు.
{{/usCountry}}పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, ఒక నటుడిగా తాము గౌరవిస్తామని చెప్తూనే.. తెలంగాణ అంతర్గత వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యాన్ని ఇక్కడి ప్రజలు అస్సలు సహించబోరని కేటీఆర్ హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ ఉందన్న కేటీఆర్.. అయితే నాయకులు రాష్ట్రంపై వ్యాఖ్యలు చేసే ముందు ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, సెంటిమెంట్లు, త్యాగాలను అర్థం చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ అంత తేలికగా ఏర్పడలేదని, దశాబ్దాల పోరాటం, వేలాది మంది త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు కేటీఆర్. 2027 సంవత్సరంలో తాను రాష్ట్రవ్యాప్తంగా 'పాదయాత్ర' చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.